NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే! 
    తదుపరి వార్తా కథనం
    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే! 
    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!

    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే! 

    వ్రాసిన వారు Stalin
    Aug 02, 2023
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్(NEW) సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి.

    గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్లలోని డేటా ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు.

    దేశంలో మొత్తం 4,001మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా వారి మొత్తం ఆస్తులు రూ. 54,545 కోట్లుగా ఏడీఆర్ నివేదిక చెబుతోంది.

    ఇది మొత్తం నాగాలాండ్, మిజోరాం, సిక్కింల 2023-24వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువ కావడం గమనార్హం.

    నాగాలాండ్ బడ్జెట్ 2023-24 రూ.23,086 కోట్లు, మిజోరం రూ.14,210 కోట్లు, సిక్కిం రూ.11,807 కోట్లు.

    అంటే ఈ మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కలిపితే రూ. 49,103 కోట్లు మాత్రమే అవుతుంది.

    ఏడీఆర్

    సగటు ఆస్తిలో వైసీపీ ఎమ్మెల్యేలే టాప్ 

    మొత్తం 84రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.13.63 కోట్లుగా నివేదిక పేర్కొంది.

    ప్రధాన పార్టీల పరంగా చూస్తే, 1,356మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒక సభ్యుడి సగటు ఆస్తి రూ.11.97కోట్లు కాగా, 719మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.21.97కోట్లు, 227టీఎంసీల ఎమ్మెల్యేలకు రూ.3.51కోట్ల చొప్పున, 161మంది ఆప్ ఎమ్మెల్యేలకు రూ.10.20 కోట్ల చొప్పు, వైఎస్సార్సీపీకి చెందిన 146 మంది ఎమ్మెల్యేలకు 23.14కోట్లుగా విశ్లేషించారు.

    దేశ వ్యాప్తంగా చూసుకుంటే, వైసీపీ ఎమ్మెల్యే సగటు వ్యక్తిగత ఆస్తి ఎక్కువగా ఉంది.

    దేశంలోని బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 16,234కోట్లు కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 15,798కోట్లు. ఈ రెండు పార్టీల వద్ద రూ. 32,032కోట్లు ఉన్నట్లు నివేదిక చెబుతోంది.

    ఏడీఆర్

    కర్ణాటక టాప్, 3వ స్థానంలో ఏపీ, 8వ ప్లేస్‌లో తెలంగాణ 

    రాష్ట్రాల వారీగా చూసుకుంటే, కర్ణాటకలో 223 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, వారి ఆస్తులు రూ.14,359 కోట్లుగా నివేదిక పేర్కొంది.

    దీంతో ఈ జాబితాలో కర్ణాటక టాప్‌లో ఉంది. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఎనిమిదో స్థానంలో తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.

    మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న 284 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ.6,679 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌‌లోని 175 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ.4,914 కోట్లుగా విశ్లేషించారు.

    కర్ణాటకలోని ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆస్తులు మిజోరాం, సిక్కిం వార్షిక బడ్జెట్‌ల కంటే ఎక్కువ.

    మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల్లో 26 శాతం కర్ణాటక ఎమ్మెల్యేలవే కావడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎమ్మెల్యే
    బీజేపీ
    కాంగ్రెస్
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఎమ్మెల్యే

    నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం నాగాలాండ్
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక

    బీజేపీ

    అజిత్ పవార్ ఉదంతం: 2024 ఎన్నికల వేళ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    బీజేపీ చీఫ్ నాకెందుకివ్వరు అంటున్న ఎమ్మెల్యే రఘునందన్.. పార్టీలో రాజుకుంటున్న అగ్గి ఎమ్మెల్యే
    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర

    కాంగ్రెస్

    బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం బిహార్
    పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా? పాట్న
    'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల ఆంధ్రప్రదేశ్
    యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' తెలుగు సినిమా
    ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా ఆంధ్రప్రదేశ్
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025