NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India Pakistan War: 100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్‌.. సరిహద్దుల్లో హై అలర్ట్‌!
    తదుపరి వార్తా కథనం
    India Pakistan War: 100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్‌.. సరిహద్దుల్లో హై అలర్ట్‌!
    100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్‌.. సరిహద్దుల్లో హై అలర్ట్‌!

    India Pakistan War: 100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్‌.. సరిహద్దుల్లో హై అలర్ట్‌!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    10:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ దాని ఆక్రమణదారుల ధోరణిని మార్చకుండానే దాడులకు తెగబడుతోంది.

    భారత్ చెరిలో ఇప్పటికే గట్టి దెబ్బలు తిన్నా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు వరుసగా రెండో రోజూ డ్రోన్ దాడులకు యత్నించింది.

    జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో భారత భూభాగంపై దాడి చేయాలని పాకిస్థాన్ ప్రయత్నించింది.

    అయితే భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. సాంబా సెక్టార్, జమ్మూ, పఠాన్ కోట్, పోఖ్రాన్ ప్రాంతాల్లో మరోసారి పాక్ డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి.

    జమ్మూ, సాంబా సెక్టార్, పఠాన్ కోట్‌లో భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని తూట్లతో కూల్చివేసింది. ఈ పరిణామాల మధ్య కేంద్రం సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది.

    Details

    11 ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డ పాక్

    మొత్తం 11 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది.

    ఫిరోజ్‌పుర్‌లోని నివాస ప్రాంతాలపై డ్రోన్లు దాడి చేయడం వల్ల పౌరులకు గాయాలు అయ్యాయి. ఇప్పటి వరకు 100కి పైగా పాక్ డ్రోన్లను భారత భద్రతా బలగాలు విజయవంతంగా కూల్చివేశాయి.

    ఇదిలా ఉంటే, ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్నారు. దీనికి భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందిస్తోంది.

    యూరీ, కుప్వారా, పూంచ్, నౌగామ్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయి. జైసల్మేర్, అమృత్ సర్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్ అవుట్ పరిస్థితులు ఏర్పడ్డాయి.

    జమ్ముకశ్మీర్‌లో తాను ఉన్న ప్రాంతంలో కూడా కాల్పుల శబ్దాలు వినిపించాయని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    India Pakistan War: 100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్‌.. సరిహద్దుల్లో హై అలర్ట్‌! పాకిస్థాన్
    India Pak War: ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై అలజడి ఆపరేషన్‌ సిందూర్‌
    Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్ జమ్ముకశ్మీర్
    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం

    పాకిస్థాన్

    India-Pakistan: పాకిస్థాన్‌కు భారత్ షాక్‌.. అన్ని మెయిల్స్‌, పార్సిళ్ల నిలిపివేత కేంద్ర ప్రభుత్వం
    Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక ప్రపంచం
    Pakistani Ranger: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్‌ రేంజర్‌ను పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు భారతదేశం
    India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025