NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్
    ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 07, 2025
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత రక్షణ దళాలు త్రివిధ సేనల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.

    ఈ దాడుల్లో అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.

    ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులు వంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించిందని తెలుస్తోంది.

    Details

    ఆత్మాహుతి డ్రోన్ల వినియోగం 

    ఈ దాడుల్లో ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లు సమాచారం. ఇవి 'లాయిటరింగ్ మ్యూనిషన్' అని పిలుస్తారు. ఈ డ్రోన్లు లక్ష్యాలను గుర్తించి, వాటిపై విరుచుకుపడతాయి.

    ఇవి ప్రత్యేకమైన నిఘా సామర్థ్యాలు కలిగి ఉంటాయి, తద్వారా శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించవచ్చు.

    ఈ డ్రోన్లు సైనికులకు ప్రాణ నష్టం నివారించడంలో సాయపడతాయి

    స్కాల్ప్ క్షిపణులు

    స్కాల్ప్ క్షిపణులు, లేదా "స్ట్రామ్ షాడో", ఫ్రాన్స్ తయారుచేసిన దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్‌లు. ఇవి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు సామర్థ్యమున్నవి.

    వీటిని యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. భారత సైన్యం తాజాగా ఈ క్షిపణులను ఫ్రాన్స్ తయారీ రఫేల్ విమానాల నుంచి ప్రయోగించినట్లు భావిస్తున్నారు.

    Details

    హ్యామర్ బాంబులు 

    హ్యామర్ బాంబులు బలమైన నిర్మాణాలు, బంకర్లను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి స్మార్ట్ బాంబుల కోవలోకి వస్తాయి, మరియు 50-70 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించవచ్చు.

    ఈ బాంబులు బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

    ఉగ్ర స్థావరాల లక్ష్యాలు

    భారత సైన్యం పాక్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా సంస్థల ముఖ్యమైన ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది.

    బహవల్పూర్‌లోని మర్కజ్ సుబాన్, జైషే మహమ్మద్‌కు చెందిన ప్రధాన కార్యాలయం, లష్కరే తోయిబా కార్యాలయం, ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది, వీటి దాడి లక్ష్యంగా నిలిచాయి.

    Details

     సమన్వయంతో ఆపరేషన్స్ 

    ఈ ఆపరేషన్‌ను భారత ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీ అత్యంత సమన్వయంతో నిర్వహించాయి.

    బవహల్పూర్ మరియు మురిద్కేలను ధ్వంసం చేయడం వాయుసేన బాధ్యతగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర ఉగ్ర స్థావరాలపై దాడులు భారత ఆర్మీ చేతులా జరిగాయి.

    నౌకాదళం తన నిఘా వ్యవస్థలను వినియోగించి ఈ ఆపరేషన్‌కు సహకరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025