English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Apple : ఆపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు.. ఫోన్ హ్యాకింగ్ పై వివరణ ఇవ్వాలన్న ఐటీ శాఖ
    తదుపరి వార్తా కథనం
    Apple : ఆపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు.. ఫోన్ హ్యాకింగ్ పై వివరణ ఇవ్వాలన్న ఐటీ శాఖ
    Apple: ఆపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు.. హ్యాకింగ్ పై వివరణ ఇవ్వాలన్న ఆదేశం

    Apple : ఆపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు.. ఫోన్ హ్యాకింగ్ పై వివరణ ఇవ్వాలన్న ఐటీ శాఖ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 02, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా దిగ్గజ సెల్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు జారీ చేసింది.

    ఈ మేరకు లోక్ సభ సభ్యులు కేంద్రంపై చేసిన హ్యాకింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

    ఇండియా కూటమిలోని ప్రతిపక్ష నేతల ఫోన్లలో మాల్ వేర్ చొప్పించేందుకు ప్రయత్నం జరిగిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నల వర్షం కురిపించింది.

    దీనిపై ఎటువంటి ఆధారాలున్నాయో చూపించాలని, వాటిని తమకు అప్పగించాలని కేంద్ర ఐటీ శాఖ నోటీసుల్లో స్పష్టనిచ్చింది.

    తమ ఫోన్లను భారత ప్రభుత్వం హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేతలు శశిథరూర్, మహువా మోయిత్రా సహా పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

    details

     ఏకంగా స్పీకర్ కు లేఖ రాసిన మహువా మోయిత్రా

    టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా అయితే ఏకంగా స్పీకర్ కు లేఖ కూడా సంధించారు. ఈ మేరకు ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన అలెర్ట్ మెసేజీలను మోయిత్రా బహిర్గతం చేశారు.

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సైతం ఈ అలెర్ట్ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రతిపక్ష నేతల ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ బదులిచ్చారు.

    ఆపిల్ కంపెనీ దాదాపుగా 150 దేశాల్లోని తన వినియోగదారులకు అలెర్ట్ మెసేజీలు పంపించిందన్నారు.

    ఒక్కోసారి పొరపాటున ఇటువంటివి జరుగుతాయని, దీనిపై యాపిల్ ను వివరణ కోరతామన్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ఆపిల్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కేంద్ర ప్రభుత్వం

    Onion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్‌ స్టాక్‌ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు  ఉల్లిపాయ
    హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం  హిమాచల్ ప్రదేశ్
    పోస్టాఫీసుల్లో కీలక మార్పులు.. సేవింగ్స్ ఖాతాదారులకు ముఖ్యగమనిక పోస్టల్ డిపార్ట్మెంట్
    ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం  బిజినెస్

    ఆపిల్

    2024లో మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 ఐఫోన్
    ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఐఫోన్
    ఏ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ తీసుకుంటే బాగుంటుంది? టెక్నాలజీ
    ఆపిల్ Music క్లాసికల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఫీచర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025