Page Loader
Indian Navy: అరేబియా సముద్రంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకలో అగ్నిప్రమాదం.. కాపాడిన నేవీ 
అరేబియా సముద్రంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకలో అగ్నిప్రమాదం.. కాపాడిన నేవీ

Indian Navy: అరేబియా సముద్రంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకలో అగ్నిప్రమాదం.. కాపాడిన నేవీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అరేబియా సముద్రంలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో 14 మంది భారతీయ సిబ్బంది ఆ నౌకలో ఉండగా, భారత నౌకాదళం అత్యంత వేగంగా స్పందించి వారిని సురక్షితంగా రక్షించింది. 'ఎం.టి.యి చెంగ్ 6'(MT Yi Cheng 6) అనే ఆయిల్ ట్యాంకర్ పులావు దేశ జెండాను ఎగురవేస్తూ, గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవు నుంచి ఒమన్‌లోని షినాస్‌ బందరుకు బయలుదేరింది. ఈట్యాంకర్‌లో మొత్తం 14మంది భారతీయ నౌకా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి.దీంతో నౌకలో ఉన్న విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అందులోని సిబ్బంది నిస్సహాయ స్థితిలో నడి సముద్రంలో చిక్కుకుపోయారు.

వివరాలు 

 ప్రశంసనీయంగా నిలిచిన భారత నౌకాదళం ధైర్యసాహసాలు

ఆపదలో చిక్కుకున్న నౌక నుంచి తక్షణమే సహాయం కోసం డిస్ట్రెస్ కాల్ పంపారు. అదే సమయంలో ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ తబార్ (INS Tabar) స్టెల్త్ యుద్ధనౌక ఆ సంకేతాన్ని స్వీకరించింది. ఈ యుద్ధ నౌకపై 13 మంది భారతీయ నౌకాదళ సిబ్బంది, మరో ఐదు మంది సిబ్బంది ఉన్నారు. ఐఎన్ఎస్ తబార్ అప్రమత్తంగా స్పందిస్తూ వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషించింది. సాంకేతిక పరికరాలతో సహాయ చర్యలు చేపట్టి నౌకలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా రక్షించింది. ఈ మొత్తం రక్షణ చర్యలో భారత నౌకాదళం చూపించిన స్పందన వేగం, ధైర్యసాహసాలు ప్రశంసనీయంగా నిలిచాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండియన్ నేవీ చేసిన ట్వీట్