NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక
    భారతదేశం

    భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక

    భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 22, 2023, 11:52 am 0 నిమి చదవండి
    భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక

    ప్రతి సంవత్సరం భారత భూభాగం సుమారు 5 సెం.మీ వరకు స్థాన భ్రంశం అవుతున్నట్లు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ ప్రభావం హిమాలయ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఫలితంగా రాబోయే రోజుల్లో భూకంపాలు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలో ఇటీవల భూకంపాలు తరుచూ సంభవిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా గత వారం రోజుల్లో పలుసార్లు భూమి కంపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే భవిష్యత్‌లో ఇలా చిన్న స్థాయిలో రాకపోవచ్చని పూర్ణచంద్రరావు చెప్పడం గమనార్హం.

    హిమాలయాల వెంట పెరుగుతున్న ఒత్తిడి

    ఉపరితలం వివిధ పలకలను కలిగి ఉంటుందని పూర్ణచంద్రరావు వెల్లండిచారు. ఉపరితలం నిరంతరం కదలిక వల్ల, పలకలు కూాడా కదులుతాయని చెప్పారు. దీని వల్ల హిమాలయాల వెంట ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించారు. ఫలితంగా భారీ స్థాయిలో భూకంపాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో తమకు 18 సీస్మోగ్రాఫ్ స్టేషన్ల బలమైన నెట్‌వర్క్ ఉందని చెప్పారు. హిమాచల్, ఉత్తరాఖండ్‌తో సహా నేపాల్ పశ్చిమ భాగానికి మధ్య భూకంప అంతరం అని పిలువబడే ప్రాంతంలో ఎప్పుడైనా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    హైదరాబాద్
    భూకంపం

    తాజా

    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం
    సౌతాఫ్రికాకు తొలగిన అడ్డంకి.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన సఫారీలు! క్రికెట్
    ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా? తెలంగాణ
    ప్రేరణ: జీవితాన్ని పరుగు పందెంలా భావిస్తే గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు  ప్రేరణ

    భారతదేశం

    మోచా తుఫాను వచ్చేస్తోంది: దేశంలోని ఏయే ప్రాంతాలు ప్రభావితం అవుతాయంటే?  భారతదేశం
    NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? తాజా వార్తలు
    15వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు.. కోడాక్ నుంచి లాంచ్ ప్రపంచం
    నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు విమానం

    హైదరాబాద్

     హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం విశాఖపట్టణం
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ ప్రియాంక గాంధీ
    తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం తెలంగాణ
    దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ ప్రారంభం; దీని విశేషాలు ఇవిగో తెలంగాణ

    భూకంపం

    జపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం జపాన్
    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  ఇండోనేషియా
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు తాజా వార్తలు
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? రాజస్థాన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023