Andhra Pradesh -Inter Result:త్వరలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు
ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు స్పాట్ వాల్యూషన్ ప్రక్రియను పూర్తి చేసేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూల్యాంకన పున:పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. ఈ వారాంతం లోగానే లేదా ఈనెల 12న లేదా 15 వ తేదీలోగా ఇంటర్ ఫలితాలను వెల్లడించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. జవాబు పత్రాల మూల్యాంకన పున: పరిశీలన అనంతరం మార్కులను డిజిటల్ గా నమోదు చేసి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీలో ఇంటర్ పరీక్షలకు పది లక్షలమంది హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలతో పలు పోటీ పరీక్షలకు లింక్ ఉండటంతో రిజల్ట్స్ త్వరగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఇప్పటికే చర్యలు తీసుకుంది.