NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?
    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?

    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?

    వ్రాసిన వారు Stalin
    May 21, 2023
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాల ప్రజల దశాబ్దాల డిమాండ్ నెరవేరింది.

    జీఓ నంబర్ 111ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

    జీవోను రద్దు చేయడం ద్వారా తెలంగాణలో మరో నగర నిర్మాణానికి ప్రభుత్వం నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌‍ పరివాహక ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో అనుచిత పారిశ్రామికీకరణ, భారీ నిర్మాణ కార్యకలాపాలు, కాలుష్యాన్ని నిరోధించేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో జీఓ నంబర్ 111ను జారీ చేసింది.

    కేవలం వ్యవసాయానికే 84గ్రామాల్లోని భూములను వినియోగించాలని జీఓ 111 చెప్పడంతో చాలా ఏళ్ల పాటు ఆ ప్రాంత ప్రజలు దీన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

    హైదరాబాద్ 

    84 గ్రామాల్లో 1.32 లక్షల ఎకరాల భూములు

    గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని శంషాబాద్‌ రెవెన్యూ మండలాల్లో గల 84గ్రామాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ పరివాహక ప్రాంతం పరిధిలోకి వస్తాయి.

    మొత్తం ఏడు మండలాలకు జీఓ 111 వర్తిస్తుంది. అందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు మండలం ఉంది.

    ఈ ఏడు మండలాల పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ 84గ్రామాలు మరో హైదరాబాద్ విస్తీర్ణానికి సమానం కావడం గమనార్హం. దీంతో జీఓ 111ను రద్దు చేయడంతో ఈ గ్రామాల్లో అంక్షలన్నీ ఎత్తవేయడంతో పారిశ్రామికాభివృద్ధికి మార్గం సుగమమైంది.

    దీంతో ఇప్పుడు అభివృద్ధి అంతా ఈ 84గ్రామాల వైపే జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    హైదరాబాద్

    నీటి కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు

    వాస్తవానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌‌లోని నీరు కలుషితం కాకుండా ఉండేందుకు జీఓ111ను తీసుకొచ్చారు.

    అయితే ఇప్పుడు ఆ జీఓను రద్దు చేసిన తర్వాత నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    హైదరాబాద్ నగరంలో తాగు నీటి కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌‌‌తో పాటు గోదావరి, కృష్ణా, మంజీర నదుల నుంచి నీటి సరఫరా జరుగుతోంది.

    అయితే ప్రధానంగా గండిపేట, హిమాయత్ సాగర్‌లపై ప్రభావం చూపుతున్న నీటి కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు త్వరలో రింగ్ మెయిన్, ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు.

    కొండపోచమ్మ సాగర్‌ను కాళేశ్వరం నీటితో నింపనున్నారు. మూసీని కూడా కాళేశ్వరం నీటితో నింపనున్నారు. ఈ రెండు జలాశయాలను నగరంలోని ఇతర నీటి వనరులతో అనుసంధానం చేయనున్నారు.

    హైదరాబాద్

    కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే ప్రభుత్వం ప్రకటన

    వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం గతేడాదే జిఓ 111 ఆంక్షలను ఎత్తివేసింది. దీనికి బదులుగా జీఓ 69ని తీసుకొచ్చింది.

    అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. 2022 సెప్టెంబరులో, రాష్ట్ర ప్రభుత్వం సరస్సులను కాలుష్యం నుంచి కాపాడటానికి బ్యూరోక్రాట్ల కమిటీ వేస్తామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చేదాక జీఓ 111ఆంక్షలు అలాగే ఉంటాయని హైకోర్టుకు సర్కారు చెప్పింది.

    అనంతరం సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

    సరస్సుల పరిరక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి కమిటీ తన నివేదికను సమర్పించిందని, దాని ఆధారంగా ప్రభుత్వం జీఓ 111ను ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    హైదరాబాద్

    రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ తెలంగాణ
    హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు ప్రకటన
    పెళ్లిళ్ల సీజన్‌ వేళ ఆకాశానంటిన బంగారం ధర; పది గ్రాములు రూ.61,360 తాజా వార్తలు
    రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత సికింద్రాబాద్

    తెలంగాణ

    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన విద్యార్థులు
    TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు  టీఎస్ఆర్టీసీ
    TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు హైదరాబాద్
    తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తాజా వార్తలు

    దిల్లీ-సిడ్నీ: గాలిలో ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపు, ప్రయాణికులకు గాయాలు  ఎయిర్ ఇండియా
    వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ  ఐక్యరాజ్య సమితి
    ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ మన్‌సుఖ్ మాండవీయ
    రోసోప్ వీరవిహారంతో 213 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్; పంజాబ్ లక్ష్యం 214 రన్స్  ఢిల్లీ క్యాపిటల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025