జమ్ముకశ్మీర్: ఉధంపూర్లో కూలిన పాదచారుల వంతెన; 20 మందికిపైగా గాయాలు
వ్రాసిన వారు
Stalin
Apr 14, 2023
04:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉధంపూర్లోని చెనాని బ్లాక్లోని బైన్ గ్రామంలోని బేని సంగం ప్రమాదవశాత్తు పాదచారుల వంతెన కుప్పకూలి 20 మందికి పైగా గాయపడ్డారు. బైశాఖి పండుగ నేపథ్యంలో వంతెనపై పాదచారుల రద్దీ పెరగడంతో ఒక్కసారిగా కూలిపోయింది. క్షతగాత్రులను చెనానిలోని నగర ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను చెనానిలోని సిటీ హెల్త్ సెంటర్కు తరలించామని ఉధంపూర్ ఎస్ఎస్పీ డాక్టర్ వినోద్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి