NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం
    తదుపరి వార్తా కథనం
    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం

    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం

    వ్రాసిన వారు Stalin
    Mar 20, 2023
    06:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం భారత్, జపాన్ మధ్య రెండు కీలక ఒప్పందాలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు.

    జపనీస్ భాషలో ఎంఓకే (మెమోరాండం ఆఫ్ కోఆపరేషన్) పునరుద్ధరణ, భాషా అభ్యాసంపై దృష్టి సారించడానికి ఇది దోహదపడుతుంది. రెండవ ఒప్పందం ముంబయి-అహ్మదాబాద్ మధ్య హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్‌పై 300 బిలియన్ల జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) రుణంపై నోట్ల మార్పిడిపై ఇరు దేశాలు సంతకాలు చేసినట్లు క్వాత్రా చెప్పారు.

    'ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్‌ కోసం 2022లో తొలిసారిగా జైకాతో భారత ప్రభుత్వానికి 1,00,000 మిలియన్ జపనీస్ యెన్ రుణం కోసం ఒప్పందం జరిగింది.

    జపాన్

    జపాన్‌తో సంబంధాలు భారతదేశానికి ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమే: క్వాత్రా

    జపాన్ షింకన్‌సెన్ సాంకేతికత(బుల్లెట్ రైలు) సాయంతో ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య హై-స్పీడ్ రైలును నిర్మించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. హై-ఫ్రీక్వెన్సీ మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చి, దేశంలో ప్రయాణాలను మరింత వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది.

    తాజాగా నాలుగో విడత రుణం కింద భారతదేశం, జపాన్ మధ్య రుణ ఒప్పందం జరిగినట్లు క్వాత్రా చెప్పారు.

    జపాన్‌తో సంబంధాలు ఎల్లప్పుడూ భారతదేశానికి చాలా ప్రత్యేకం అని అన్నారు.

    2014లో మోదీ ప్రధాని అయ్యాక ఆయన మొదటి ద్వైపాక్షిక పర్యటన జపాన్‌లోనే జరిగిందనే విషయాన్ని క్వాత్రా గుర్తు చేశారు.

    భారతదేశం-జపాన్ సంబంధాలు ఈ ప్రాంతంలో అత్యంత సహజమైన భాగస్వామ్యాల్లో ఒకటని క్వాత్రా అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జపాన్
    భారతదేశం
    రైల్వే శాఖ మంత్రి

    తాజా

    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు
    NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్‌..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!  జూనియర్ ఎన్టీఆర్
    Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల భూములపై భారీ స్థాయిలో ఆక్రమణలు, నిర్మాణాలు.. టీజీఆర్‌ఏసీ నివేదికలో కీలక అంశాలు  హైదరాబాద్
    Mumbai Indians: ముంబై జట్టులోకి విధ్వంసకర ఆటగాడు? ముంబయి ఇండియన్స్

    జపాన్

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన ఆటో మొబైల్
    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా చైనా
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    భారతదేశం

    ఆధార్ కార్డ్ పోయిందా, అయితే ఇలా చేయండి ఆధార్ కార్డ్
    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ బ్యాంక్
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి ఆసియా
    టాప్-ఎండ్ కియా కేరెన్స్ కంటే ఎంట్రీ-లెవల్ టయోటా ఇన్నోవా క్రిస్టా మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025