NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / JEE Main 2025 Results: జేఈఈ (మెయిన్‌) సెషన్‌ -2 ఫలితాలు విడుదల.. నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    JEE Main 2025 Results: జేఈఈ (మెయిన్‌) సెషన్‌ -2 ఫలితాలు విడుదల.. నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్‌
    జేఈఈ (మెయిన్‌) సెషన్‌ -2 ఫలితాలు విడుదల

    JEE Main 2025 Results: జేఈఈ (మెయిన్‌) సెషన్‌ -2 ఫలితాలు విడుదల.. నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    08:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయస్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్‌ 2025 రెండో సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి.

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేయడంతో పాటు, విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోర్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు.

    ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీలలో పేపర్ -1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

    ఫలితాలను చూసేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఉపయోగించి స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

    వివరాలు 

    నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్‌  

    ఈసారి జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గొప్ప విజయం సాధించారు.

    హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు పొందారు.

    బనిబ్రత మాజీ, వంగల అజయ్‌రెడ్డి ఇద్దరూ 300కి 300 మార్కులు సాధించడంతో, ఇద్దరికీ ఒకే ర్యాంకు కేటాయించారు.

    ఇతర రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు కూడా ఇదే ర్యాంకు వచ్చే అవకాశముంది.

    ఈసారి వయసు ఆధారంగా ర్యాంకుల కేటాయింపు ప్రామాణికంగా తీసుకోకపోవడంతో, సమాన మార్కులు వచ్చినవారికి ఒకే ర్యాంకు కేటాయించనున్నారు.

    వివరాలు 

    విభాగాలవారీగా కటాఫ్ స్కోర్లు: 

    ఈడబ్ల్యూఎస్ విభాగంలో అజయ్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలానికి చెందిన తాటిపాడు గ్రామం.

    9వ తరగతి నుంచి హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఈ ఏడాది జనరల్ విభాగానికి కటాఫ్ పర్సంటైల్ 93.102గా నిర్ణయించగా, గత సంవత్సరం అది 93.236గా ఉంది. మొత్తం 14.75 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

    జనరల్‌ - 93.102 పర్సంటైల్‌

    ఈడబ్ల్యూఎస్‌ - 80.383 పర్సంటైల్‌

    ఓబీసీ - 79.431 పర్సంటైల్‌

    ఎస్సీ - 61.15 పర్సంటైల్‌

    ఎస్టీ - 47.90 పర్సంటైల్‌

    వివరాలు 

     24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోర్ 

    ఈ కటాఫ్‌కు సమానమైన లేదా ఎక్కువ స్కోర్ పొందినవారికే మే 18న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయేందుకు అర్హత ఉంటుంది.

    ఈ రెండు సెషన్లను కలిపి మొత్తం 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోర్ సాధించారు.

    వీరిలో తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, హర్ష్ ఎ. గుప్తా, అజయ్‌రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఈ జాబితాలో ఉన్నారు.

    వివరాలు 

    సెషన్ 1, 2లో ఉత్తమ స్కోరుతో ర్యాంకుల కేటాయింపు 

    విద్యార్థులు సెషన్ 1,సెషన్ 2లో సాధించిన ఉత్తమ స్కోర్‌ను ఆధారంగా తీసుకొని ర్యాంకులు కేటాయించబడ్డాయి.

    తర్వాత సామాజిక వర్గాల ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేసి మొత్తం 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అర్హత కల్పిస్తారు.

    ఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రముఖ ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశముంటుంది.

    జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 23 నుండి మే 2 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మే 18న ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

    తాజా

    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

    UGC NET 2024 cancelled: రద్దైన పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? అప్‌డేట్ ఇచ్చిన NTA  యుజిసి-నెట్ 2024
    NEET UG 2024 retest result:  నీట్​ యూజీ రీటెస్ట్​ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి?  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025