NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు
    భారతదేశం

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 03, 2023, 07:31 pm 1 నిమి చదవండి
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు
    బిహార్‌లో పర్యటించిన జేపీ నడ్డా

    భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత.. నడ్డా బిహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్‌పై నడ్డా విమర్శాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడ లేదని నడ్డా విమర్శించారు. నితీశ్‌ను ఉద్దేశించి.. ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ చేసిన కామెంట్లను ఈ సందర్భంగా నడ్డా ప్రస్తావించారు. నితీశ్‌ను సుధాకర్ సింగ్ 'శిఖండి'గా అభివర్ణించారని, అయితే ఆ పదాన్ని తాను ఇప్పుడు ఉచ్ఛరించదల్చుకోలేదన్నారు. కానీ, బిహార్ ప్రజలను నితీశ్ అగౌరపర్చారని దుయ్యబట్టారు. ఒకరకంగా రాష్ట్ర ప్రజలను ఆయన మోసం చేశారని మండిపడ్డారు.

    'బీజేపీ పాలనకు సమయం ఆసన్నమైంది'

    ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. బిహార్‌కు బీజేపీ నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైనట్లు నడ్డా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నడ్డా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1917లో మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన ఆశ్రమం నుంచి నితీశ్ తన యాత్రను ప్రారంభించనున్నారు. యాత్ర సందర్భంగా తాను అన్ని ప్రాంతాలను సందర్శిస్తానని, ప్రజలను కలుస్తానని, అనంతరం అందరం కలిసి నిర్ణయాలు తీసుకుంటామని నితీష్ కుమార్ చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    బిహార్
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    బిహార్

    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు లాలూ ప్రసాద్ యాదవ్
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం లాలూ ప్రసాద్ యాదవ్

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ ఇండియా లేటెస్ట్ న్యూస్
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా అమిత్ షా
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023