Page Loader
MLC Kavitha: కవితకు దక్కని ఊరట.. జులై 3 వరకు రిమాండ్
MLC Kavitha: కవితకు దక్కని ఊరట.. జులై 3 వరకు రిమాండ్

MLC Kavitha: కవితకు దక్కని ఊరట.. జులై 3 వరకు రిమాండ్

వ్రాసిన వారు Stalin
Jun 03, 2024
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కల్వకుంట్ల కవితపై ప్రొడక్షన్ వారెంట్ జారీ చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కోర్టులో హాజరుపర్చడంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా కస్టడీని పొడిగించారు. ఈ కేసులో మే 29న బీఆర్‌ఎస్ నేతపై చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం కోర్టు ఈ వారెంట్లు జారీ చేసింది. ఇదే కేసులో నిందితులు ప్రిన్స్, దామోదర్, అరవింద్ సింగ్ లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ విచారణలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయకుండానే చార్జిషీట్ దాఖలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Details 

ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ అంటే ఏమిటి? 

ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో గత మార్చిలో ఎన్‌ఫోర్స్‌‌మెంట్‌ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సీబీఐ మరో కేసు నమోదు చేసింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.

Details 

ఈడీ దాఖలు చేసిన సప్లమెంటరీ ఛార్జిషీట్‌లో కీలక అంశాలు 

సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ కొనసాగింది. ఆమెను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రవేశపెట్టారు.ఈడీ దాఖలు చేసిన సప్లమెంటరీ ఛార్జిషీట్‌లో కీలక అంశాలను అధికారులు కోర్టు ముందు ఉంచారు. లిక్కర్ కేసులో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తంగా రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కొంది. అందులో.. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది. అది కాకుండా.. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది.