NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MLC Kavitha: కవితకు దక్కని ఊరట.. జులై 3 వరకు రిమాండ్
    తదుపరి వార్తా కథనం
    MLC Kavitha: కవితకు దక్కని ఊరట.. జులై 3 వరకు రిమాండ్
    MLC Kavitha: కవితకు దక్కని ఊరట.. జులై 3 వరకు రిమాండ్

    MLC Kavitha: కవితకు దక్కని ఊరట.. జులై 3 వరకు రిమాండ్

    వ్రాసిన వారు Stalin
    Jun 03, 2024
    06:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కల్వకుంట్ల కవితపై ప్రొడక్షన్ వారెంట్ జారీ చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కోర్టులో హాజరుపర్చడంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా కస్టడీని పొడిగించారు.

    ఈ కేసులో మే 29న బీఆర్‌ఎస్ నేతపై చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం కోర్టు ఈ వారెంట్లు జారీ చేసింది.

    ఇదే కేసులో నిందితులు ప్రిన్స్, దామోదర్, అరవింద్ సింగ్ లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    ఈడీ విచారణలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయకుండానే చార్జిషీట్ దాఖలు చేశారు.

    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

    Details 

    ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ అంటే ఏమిటి? 

    ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

    ఈ కేసులో గత మార్చిలో ఎన్‌ఫోర్స్‌‌మెంట్‌ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సీబీఐ మరో కేసు నమోదు చేసింది.

    గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు.

    ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.

    Details 

    ఈడీ దాఖలు చేసిన సప్లమెంటరీ ఛార్జిషీట్‌లో కీలక అంశాలు 

    సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ కొనసాగింది.

    ఆమెను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రవేశపెట్టారు.ఈడీ దాఖలు చేసిన సప్లమెంటరీ ఛార్జిషీట్‌లో కీలక అంశాలను అధికారులు కోర్టు ముందు ఉంచారు.

    లిక్కర్ కేసులో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తంగా రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కొంది.

    అందులో.. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది.

    అది కాకుండా.. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    కల్వకుంట్ల కవిత

    ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  సుప్రీంకోర్టు
    దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  సుప్రీంకోర్టు
    కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్  ధర్మపురి అరవింద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025