Loading...
Rohit sharma: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్-కోహ్లీ స్థానంపై చర్చ అవసరం లేదు.. కానీ ఒక షరతు: దీప్ దాస్‌గుప్తా
వరల్డ్‌కప్ జట్టులో రోహిత్-కోహ్లీ స్థానంపై చర్చ అవసరం లేదు.. కానీ ఒక షరతు: దీప్ దాస్‌గుప్తా

Rohit sharma: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్-కోహ్లీ స్థానంపై చర్చ అవసరం లేదు.. కానీ ఒక షరతు: దీప్ దాస్‌గుప్తా

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇకపై సిరీస్ ప్రారంభమైన తర్వాత ఫామ్ అందుకోవడానికి సమయం తీసుకునే పరిస్థితి ఉండదని మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరి భవిష్యత్తుపై సెలెక్టర్లు ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన దాస్‌గుప్తా, ఇకపై రోహిత్, కోహ్లీ తొలి మ్యాచ్ నుంచే ప్రభావవంతమైన ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఫామ్‌లోకి రావడానికి ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు తీసుకునే అవకాశం వారికి మాత్రమే కాకుండా జట్టులోని ప్రతి ఆటగాడికీ లేదని స్పష్టం చేశారు.

వివరాలు

వారి స్థానాలపై ప్రత్యేక చర్చ..

ఆటగాళ్లు తమ అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేలా వాతావరణం కల్పించడం కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ బాధ్యతల్లో కీలక భాగమని ఆయన వివరించారు.

అదే సమయంలో రోహిత్, కోహ్లీల జట్టులోని స్థానంపై అనవసరంగా చర్చించాల్సిన అవసరం లేదని దాస్‌గుప్తా పేర్కొన్నారు.

నాలుగేళ్ల క్రితం వారి స్థానంపై ఎలాంటి సందేహాలు లేవని, తమ ప్రదర్శన ఆధారంగానే జట్టులో కొనసాగుతామని వారికి అప్పుడే తెలుసని గుర్తుచేశారు.

ప్రస్తుతం కూడా అదే విధానం కొనసాగాలని, వారి విషయంలో ప్రత్యేక ప్రమాణాలు లేదా భిన్నమైన వైఖరి అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

వివరాలు

అదే వారికి పెద్ద సవాల్..

ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, రోహిత్ శర్మ చివరి మ్యాచ్‌లో శతకం నమోదు చేయగా, విరాట్ కోహ్లీ రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుతం రోహిత్, కోహ్లీల భవిష్యత్తుపై ఎక్కువ చర్చ జరగడానికి ప్రధాన కారణం వారు ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితం కావడమేనని దాస్‌గుప్తా విశ్లేషించారు.

ఒకప్పుడు వారు అన్ని ఫార్మాట్లలో ఆడినప్పుడు, ఒక ఫార్మాట్‌లో విఫలమైనా మరో ఫార్మాట్‌లోని ప్రదర్శనతో ఆ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉండేదన్నారు.

అయితే ఇప్పుడు ఒక్క వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతుండటంతో వారి తాజా ప్రదర్శనల ఆధారంగానే అందరూ అంచనా వేస్తున్నారని, ఇదే వారికి ప్రస్తుతం పెద్ద సవాలుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT