NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు.. యాత్రికుల‌కు స్వాగతం చెప్పిన సీఎం ధామి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు.. యాత్రికుల‌కు స్వాగతం చెప్పిన సీఎం ధామి
    తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు.. యాత్రికుల‌కు స్వాగతం చెప్పిన సీఎం ధామి

    Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు.. యాత్రికుల‌కు స్వాగతం చెప్పిన సీఎం ధామి

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయం ద్వారాలు శుక్రవారం ఉదయం భక్తుల కోసం తెరుచుకున్నాయి.

    వేద మంత్రోచ్చారణల నడుమ, ఉదయం 7 గంటల సమయంలో ఆలయం తలుపులు తెరిచారు.

    ఈ పవిత్ర సందర్భానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

    ఆలయాన్ని విభిన్న రకాల పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు కేదార్‌నాథ్‌కు తరలివచ్చారు.

    భక్తులపై హెలికాప్టర్ ద్వారా పుష్ప వర్షం కురిపించి ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని మరింత భక్తిశ్రద్ధలతో మేళవించారు.

    ఈ వేడుకల్లో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల కమిటీ సభ్యులు, అధికారులతో పాటు పూజారులు, వేద పండితులు పాల్గొన్నారు.

    వివరాలు 

    సోన్ ప్రయాగ్ ప్రాంతం నుంచి హెలికాప్టర్ సేవలు

    చార్ ధామ్ యాత్రలో భాగంగా ఇటీవల అక్షయ తృతీయ సందర్భంలో ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు.

    ఇక మిగిలిన బద్రీనాథ్ ఆలయం మాత్రం మే 4న భక్తులకు దర్శనార్థం అందుబాటులోకి రానుంది.

    కేదార్‌నాథ్ యాత్ర కోసం సోన్ ప్రయాగ్ ప్రాంతం నుంచి హెలికాప్టర్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

    కేదార్‌నాథ్‌కు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులతో కలిసి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది.

    భద్రతా పరంగా జమ్మూకశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకుని, కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాలతో పాటు పలు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా దళాలను భారీగా మోహరించారు.

    వివరాలు 

    మే 4న బద్రీనాథ్ ఆలయం

    ఈ నేపథ్యంలో కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్ర ఓ విధంగా ప్రారంభమైనట్టే అయింది.

    మే 4న బద్రీనాథ్ ఆలయం కూడా తెరుచుకుంటే, ఈ యాత్రలో పాల్గొనదలచిన లక్షలాది మంది భక్తులు త్వరలో ఉత్తరాఖండ్‌కి తరలిరావడంతో యాత్ర మరింత ఉత్సాహంగా సాగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఉత్తరాఖండ్

    Uttarkashi Tunnel: సొరంగంలో కార్మికుల వద్దకు రెస్క్యూ టీమ్.. 41మంది ఏ క్షణమైనా బయటకు రావచ్చు  తాజా వార్తలు
    Uttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు   భారతదేశం
    Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Ram Temple consecration: ఆలయ నిర్మాణం అసంపూర్తి: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు దూరం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025