NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్ 
    తదుపరి వార్తా కథనం
    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్ 
    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్

    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్ 

    వ్రాసిన వారు Stalin
    Jun 07, 2023
    06:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా సోషల్ మీడియా చేసిన పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది.

    నగరంలోని పలు సంఘాల నేతలు బుధవారం కొల్హాపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ హింసాత్మకంగా మారింది.

    నిరసనకారులు ఉదయం 10 గంటలకు శివాజీ మహారాజ్ చౌక్ వద్ద గుమిగూడి, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసిన ఇద్దరు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

    మరాఠా భూమిపై మొఘల్ నాయకులను కీర్తించడాన్ని సహించబోమని నిరసనకారులు తేల్చి చెప్పారు. కొంతమంది నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు ఆరోపించారు.

    మహారాష్ట్ర

    విచారణ జరుగుతోంది, చర్యలు తీసుకుంటాం: సీఎం షిండే

    నగరంలోని ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ కూడా ప్రయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతకుముందు టౌన్ హాల్ ప్రాంతంలో రాళ్ల దాడి జరిగింది.

    భారతదేశంలోని హిందువులు సురక్షితంగా లేరని, ''లవ్ జిహాద్'', ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' గురించి ప్రస్తావిస్తూ, భారతదేశంలో హిందువుల భద్రత గురించి కొంతమంది నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు.

    అనంతరం మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

    తాను కూడా శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    తాజా వార్తలు
    సోషల్ మీడియా

    తాజా

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం

    తాజా వార్తలు

    ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి  తెలంగాణ
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ  ఆంధ్రప్రదేశ్

    సోషల్ మీడియా

    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ ఫీచర్
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  ట్విట్టర్
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025