NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం
    తదుపరి వార్తా కథనం
    టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం
    59మంది టీచర్లను తొలగించాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశం

    టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం

    వ్రాసిన వారు Stalin
    Jan 06, 2023
    03:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్రమ పద్ధతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారిపై కోల్‌కతా హైకోర్టు కోరడా ఝులిపించింది. తప్పుడు మార్గాల ద్వారా ఉద్యోగాలను పొందిన 59మందిని విధుల నుంచి తొలగించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది.

    ఇప్పటికే రెండు పర్యాయాలు అక్రమంగా ఉపాధ్యాయ కొలువును సంపాంధించిన వారిని హైకోర్టు తోలగించింది. బుధవారం 143 మంది ప్రాథమిక ఉపాధ్యాయుల సర్వీసులను రద్దు చేస్తూ జస్టిస్ గంగోపాధ్యాయ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 23న 53 మంది టీచర్ల సర్వీసులను రద్దు చేస్తూ ఇదే బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఇచ్చి ఆదేశాలతో తొలగించిన టీచర్ల సంఖ్య 255కి చేరింది.

    స్కామ్

    సుప్రీంకోర్టు ఆదేశంతో..

    అక్రమ పద్ధతిలో నియామకమైన 269 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలని గతేడాది జస్టిస్ గంగోపాధ్యాయ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తమ వాదనలు వినకుండా.. ఏకపక్షంగా హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు 269 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనలు కూడా వినాలని జస్టిస్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్ బెంచ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ లెక్కన అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించింది.

    ఈ క్రమంలో తాజాగా 61 మంది ఉపాధ్యాయులు ఈ విషయంలో తమ అఫిడవిట్‌లను దాఖలు చేశారు. వారి అఫిడవిట్లు, ఇతర పత్రాలను పరిశీలించిన జస్టిస్ గంగోపాధ్యాయ.. అందులో 59 మందిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. మిగిలిన ఇద్దరి భవితవ్యం త్వరలో తేలనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025