NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు 
    తదుపరి వార్తా కథనం
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు 
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు

    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు 

    వ్రాసిన వారు Stalin
    May 19, 2023
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కోజికోడ్ జిల్లాకు వెళ్తున్న ఎలత్తూరు రైలు దహనం కేసు నిందితుల రవాణాకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణలపై కేరళ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.విజయన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

    ఈయన రాష్ట్ర ఏటీఎస్ విభాగం అధిపతిగా కూాడా పని చేశారు. ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్ జనరల్ హోదాలో పని చేస్తున్నారు.

    నిందితుడి రవాణాకు సంబంధించిన సమాచారం లీక్ కావడం తీవ్రమైన భద్రతా వైఫల్యమని సస్పెన్షన్ ఆర్డర్‌లో ప్రభుత్వం పేర్కొంది.

    లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ ఎంఆర్ అజిత్ కుమార్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం పి.విజయన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

    కేరళ

    సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

    రైలు దహనం కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలో లేని ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి విజయన్, గ్రేడ్ ఎస్‌ఐ మనోజ్ కుమార్ నిందితులను రోడ్డు మార్గంలో కోజికోడ్‌కు తీసుకువెళుతున్న క్రమంలో అధికారులను వారి వివరాలు అడిగినట్లు సస్పెన్షన్ ఆర్డర్‌లో ప్రభుత్వం చెప్పింది.

    పోలీసు ఏటీఎస్ విభాగం మరింత జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా ఉండాలన్న ఉద్దేశంతోనే అనుమానంతో విచారణకు ఆదేశించినట్లు వివరించింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

    ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విజయన్‌ను సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏడీజీపీ (పోలీస్ హెచ్‌క్యూ) పద్మకుమార్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    రైలు ప్రమాదం
    తాజా వార్తలు
    మహారాష్ట్ర

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కేరళ

    ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు భారతదేశం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? భారతదేశం
    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్

    తాజా వార్తలు

    భారత్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్  అమెజాన్‌
    భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్  ఎలాన్ మస్క్
    డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ టీకా
    కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ ఐఎండీ

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025