
యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా
ఈ వార్తాకథనం ఏంటి
'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కేసు పెడతానని చెప్పారు.
రాహుల్ గాంధీపై యూకే కోర్టులో దావా వేయనున్నట్లు లలిత్ మోదీ తెలిపారు.
'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కొద్ది రోజుల తర్వాత లలిత్ మోదీ స్పందించారు.
2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 'దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?' అని అన్నారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యల్లో లలిత్ మోదీ పేరును కూడా ప్రస్తావించారు.
లలిత్ మోదీ
ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడినట్లు రుజువు కాలేదు: లలిత్ మోదీ
ఈ వ్యవహారంలో ఆలస్యంగా స్పందించిన లలిత్ మోదీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఏ కారణాలతో తనను "పరారీ" అని ముద్రవేస్తున్నారని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీని తాను యూకే కోర్టుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు లలిత్ మోదీ ట్వీట్ చేశారు. అతను కొన్ని గట్టి సాక్ష్యాధారాలతో ముందుకు వస్తారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
పలువురు కాంగ్రెస్ నేతలను ట్యాగ్ చేస్తూ, పాలకులు కఠినమైన బాధ్యతాయుతమైన చట్టాలను ఆమోదించిన వెంటనే తాను తిరిగి వస్తానని చెపారు.
గత 15 ఏళ్లలో తాను ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడినట్లు రుజువు కాలేదన్నారు. కానీ స్పష్టంగా రుజువైన విషయం ఏమిటంటే తాను నేను ఈ ప్రపంచంలోనే 100 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించిన గొప్ప క్రీడా ఈవెంట్ను సృష్టించానని పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ పై విరుచుకుపడ్డ లలిత్ మోడీ
i see just about every Tom dick and gandhi associates again and again saying i ama fugitive of justice. why ?How?and when was i to date ever convicted of same. unlike #Papu aka @RahulGandhi now an ordinary citizen saying it and it seems one and all oposition leaders have nothing…
— Lalit Kumar Modi (@LalitKModi) March 30, 2023