NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: బైసరన్‌ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి.. హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్లు నివేదిక వర్గాలు నిర్ధారణ!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: బైసరన్‌ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి.. హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్లు నివేదిక వర్గాలు నిర్ధారణ!
    హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్లు నివేదిక వర్గాలు నిర్ధారణ!

    Pahalgam Terror Attack: బైసరన్‌ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి.. హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్లు నివేదిక వర్గాలు నిర్ధారణ!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 25, 2025
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్నిదిగ్భ్రాంతికి గురిచేసింది.

    మూడు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో ఉన్న బైసరన్‌ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

    ఈ దాడిలో మొత్తం 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా ఆవేదన కలిగించే అంశం.

    ఈ దారుణ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన బాధితులు ఇంకా తేరుకోలేకపోతున్నారు.

    ఈ క్రూరమైన దాడి వెనుక పాక్‌కు చెందిన 'లష్కర్‌ ఎ తోయిబా' ప్రధాన నేత హఫీజ్ సయీద్ హస్తం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

    అతనితో పాటు అతడి అత్యంత విశ్వాసపాత్రుడైన అనుచరుడు సైఫుల్లా కూడా ఈ దాడికి ఊతమిచ్చి ఉగ్రవాదులను అమాయకులపై దాడికి ప్రేరేపించినట్టు విశ్లేషణ జరుగుతోంది.

    వివరాలు 

    పాకిస్థాన్ ప్రభుత్వ అండతో మద్దతు

    ఈ దాడిని లష్కర్‌ ఎ తోయిబాతో అనుబంధంగా ఉన్న ఒక కఠిన మార్గాల ఉగ్రవాదుల బృందం నిర్వహించిందని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

    మంగళవారం జరిగిన ఈ ఘటనలో, ప్రధానంగా విదేశీయులుగా గుర్తింపు పొందిన ఉగ్రవాదులు పాల్గొన్నట్టు సమాచారం.

    వారికీ కశ్మీర్‌ ప్రాంతంలో ఉన్న కొన్ని స్థానిక ఉగ్రవాదులు, ఇంకా అక్కడి మద్దతుదారుల నుంచి సహకారం లభించినట్టు అనుమానిస్తున్నారు.

    హఫీజ్ సయీద్ మరియు అతని అనుచరులు ఈ బృందానికి పాకిస్థాన్ ప్రభుత్వ అండతో నేరుగా మద్దతునిచ్చి ఉండవచ్చని నిఘా వర్గాల అభిప్రాయం.

    వివరాలు 

    26/11 ఉగ్రదాడికి ప్రధాన నిందితుడిగా హఫీజ్ సయీద్

    2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడికి ప్రధాన నిందితుడిగా భావించబడుతున్న హఫీజ్ సయీద్, తాజా బైసరన్‌ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు అన్ని విధాలుగా సాయం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ దాడికి పాల్పడ్డ బృందం ఇప్పటికే కశ్మీర్‌ లోయ ప్రాంతాల్లో కొంతకాలంగా చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

    గత ఏడాది సోనామార్గ్, బూతాపత్రీ, గండేర్బల్‌ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లోనూ ఇదే ఉగ్రవాద బృందం ప్రమేయముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    2024 అక్టోబర్‌లో బూతాపత్రీలో జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా, అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ వద్ద జరిగిన మరో దాడిలో ఆరుగురు కార్మికులు మరియు ఓ వైద్యుడు మరణించిన విషయం తెలిసిందే.

    వివరాలు 

    జునైద్ అహ్మద్ భట్ ని చంపిన భద్రతా దళాలు 

    గత డిసెంబరులో భద్రతా దళాలు లష్కర్‌ ఎ తోయిబాకు చెందిన జునైద్ అహ్మద్ భట్ అనే ఉగ్రవాదిని కాల్చి చంపాయి.

    అయితే అతడి మిగిలిన సహచరులు తప్పించుకుని సమీప అడవుల్లోకి పారిపోయారు.

    ప్రస్తుతం ఈ ఉగ్రవాదులు భద్రతా బలగాల కళ్లకు చిక్కకుండా అడవుల్లో దాక్కున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

    పాకిస్థాన్లోని హ్యాండర్ల నుంచి తదుపరి ఆదేశాలు అందేవరకు వారు అండర్‌ గ్రౌండ్‌లో ఉండే అవకాశముందని తెలుస్తోంది.

    పాక్ మిలిటరీతో పాటు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నుంచి ఈ బృందానికి శరణు, శస్త్రాలు, సమాచార సహాయం లభించి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

    వివరాలు 

    మూడు వేర్వేరు ప్రదేశాలు టార్గెట్

    బైసరన్‌ లోయలో మూడు వేర్వేరు ప్రదేశాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు యాక్టివ్‌గా దాడి ప్రారంభించారు.

    పోలీసుల కథనం ప్రకారం, మొదటి ప్రాంతంలో ఐదుగురిని, రెండవ మైదాన ప్రాంతంలో ఇద్దరిని, లోయ సరిహద్దులో మిగతా 19 మందిని ఉగ్రవాదులు హత్య చేశారు.

    ఫెన్సింగ్ దాటి పారిపోయిన కొంతమంది మాత్రం ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడగలిగారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్! పవన్ కళ్యాణ్
    Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం ఆటో మొబైల్
    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు భారత వాతావరణ శాఖ
    Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్ బ్యాడ్మింటన్

    జమ్ముకశ్మీర్

    Jammu Kashmir: రాజౌరిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు  భారతదేశం
    Avalanche: భారీ హిమపాతంతో నిండిపోయిన జమ్ము.. వైరల్ అవుతున్న వీడియో భారతదేశం
    Earthquake: కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం..లడఖ్,జమ్మూ కాశ్మీర్ అంతటా ప్రకంపనలు  భూకంపం
    Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025