NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్‌ బృందం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్‌ బృందం
    ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్‌ బృందం

    Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్‌ బృందం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2025
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్రదాడుల విషయంలో భారత్‌ మౌనంగా ఉండబోదని కాంగ్రెస్ సీనియర్‌ నేత డాక్టర్ శశిథరూర్ స్పష్టం చేశారు.

    ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్‌పై విషం చిమ్మిస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు, ఆయన నేతృత్వంలోని బృందం అమెరికా వెళ్లింది.

    ఈ సందర్బంగా న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్‌ను సందర్శించిన అనంతరం శశిథరూర్‌ మీడియాతో మాట్లాడారు.

    ఉగ్రవాదం ప్రపంచానికి ఒక పెద్ద సమస్య. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

    అనంతరం భారత కాన్సులేట్‌లో జరిగిన సమావేశంలో, భారత్ ఉగ్రవాదంపై తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

    Details

    పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర స్పందన

    శశిథరూర్ మాట్లాడుతూ పహల్గాంలో మతం ఆధారంగా పర్యాటకులపై ఉగ్రదాడి జరిగినట్లు గుర్తుచేశారు.

    'ఈ దాడి వెనుక ఉద్దేశం భారత్‌లో మత సంఘర్షణలు రెచ్చగొట్టడమే. ఈ దాడిని 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' అనే ఉగ్రవాద సంస్థ నిర్వహించింది. ఇది లష్కరే తయ్యిబాకు అనుబంధంగా ఉంది.

    ఈ సంస్థను ఐరాస ఉగ్రసంస్థగా ప్రకటించాలంటూ భారత్ ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని తెలిపారు.

    తాను ప్రభుత్వంలో లేని ప్రతిపక్ష నేత అయినా, ఈ దాడిపై పాక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వ్యాసం రాశానని శశిథరూర్‌ పేర్కొన్నారు.

    భారత్ ఈ దాడికి సైనిక స్థాయిలో ప్రతీకారం తీర్చుకుందని వివరించారు.

    Details

    భారత్‌ సైన్యం కచ్చితమైన దాడులు 

    పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం కచ్చితమైన దాడులు చేసి వాటిని నేలమట్టం చేసింది.

    పాక్‌ సైన్యం ప్రతిదాడికి దిగినప్పటికీ, భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి.

    ఈ ఆపరేషన్‌తో భారత్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించదనే గట్టి సందేశం పంపిందని శశిథరూర్‌ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్‌ బృందం కాంగ్రెస్
    Heavy Rains: ఢిల్లీలో వర్ష భీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు, నగరమంతా జలమయం దిల్లీ
    Akanda 2 : అఖండ 2 విడుదలపై ఉత్కంఠ.. సంక్రాంతి కంటే ముందుగానే ప్లాన్? బాలకృష్ణ
    Apple: ఆపిల్‌కు భారత్ ఓకే.. కానీ అమెరికాలో సుంకాలు తప్పవన్న ట్రంప్ ఆపిల్

    కాంగ్రెస్

    Congress: ఆరోగ్య శాఖలో రూ.382 కోట్లు అవినీతి.. అప్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Delhi Assembly Elections 2025: ఆప్‌ అంటే ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ.. ఆప్‌పై పవన్ ఖేరా కాంగ్రెస్‌ విమర్శలు భారతదేశం
    Delhi Assembly Elections:ఆప్‌ పోస్టర్ వివాదం.. రాహుల్, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన ఆమ్‌ఆద్మీ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Rythu Bharosa: అర్ధరాత్రి తర్వాత రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025