NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి
    భారతదేశం

    తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి

    తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 30, 2023, 01:08 pm 0 నిమి చదవండి
    తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి
    ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు

    ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో గత 10నెలల్లో 111మంది శిశువులు అనుమానాస్పద కారణాలతో మరణించారు. ఈ మరణాలపై లక్నోలోని క్వీన్ మేరీ హాస్పిటల్ బృందం పరిశోధన చేయగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాజ్‌గంజ్‌లోని గర్భిణుల పాలల్లో పురుగుమందులు అవశేషాలను ఉండటం గమనార్హం. లక్నోలోని క్వీన్ మేరీ ఆసుపత్రి బృందం 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణుల నుంచి నమూనాలను సేకరించి శిశువుల మరణానికి గల కారణాలపై పరిశోధన చేసింది. ప్రొఫెసర్ సుజాతా దేవ్, డాక్టర్ అబ్బాస్ అలీ మెహందీ, డాక్టర్ నైనా ద్వివేది చేసిన పరిశోధన వివరాలు ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ జనరల్‌లో కూడా ప్రచురించారు. మాంసాహారుల కంటే శాఖాహారం తీసుకునే మహిళల పాలలో పురుగుమందుల అవశేషాలు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

    శాఖాహారుల కంటే మాంసాహారుల్లో మూడు రెట్లు ఎక్కువ

    గర్భిణుల పాలల్లో పురుగు మందుల అవశేషాలు ఎందుకున్నాయనే దానిపై పరిశోనధన బృందం ఆరా తీయగా, రసాయన వ్యవసాయమే కారణమని తేలింది. కూరగాయలు, పంటల్లో వివిధ రకాల పురుగుమందులు, రసాయనాలను వినియోగిస్తారు. మాంసానికి వినియోగించే కోళ్లు, మేకలు, గొర్రెలు త్వరగా ఎదగడానికి సప్లిమెంట్లు, రసాయనాలను ఇంజెక్ట్ చేస్తారు. అందుకే మాంసాహారం తినే తల్లి పాలలో ఉండే పురుగుమందుల అవశేషాలు, శాఖాహార మహిళ కంటే మూడు రెట్లు ఎక్కువ అని మేరీ ఆసుపత్రి బృందం పరిశోధన తేల్చింది. శిశువుల మరణాలకు కారణం పురుగుమందుల అవశేషాలా? లేక మరేదైనా ఉండొచ్చా అనే కోణంలో విచారణ చేయడానికి సీడీఓ అధ్యక్షతన జిల్లా మేజిస్ట్రేట్ కమిటీని ఏర్పాటు చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    పరిశోధన

    తాజా

    ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    కైల్ మేయర్స్ సునామీ ఇన్నింగ్స్.. లక్నో భారీ స్కోరు డిల్లీ క్యాప్‌టల్స్
    డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం ఐపీఎల్
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ

    ఉత్తర్‌ప్రదేశ్

    ఇంట్లో భారీ పేలుడు, 4మృతదేహాలు లభ్యం; రంగంలోకి ఫోరెన్సింగ్ బృందం తాజా వార్తలు
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఎంపీ
    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఉమేష్ పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం; అండర్ వరల్డ్‌ నాయకుడు అన్సారీ అరెస్టు భారతదేశం

    పరిశోధన

    అధిక విద్యుత్ ఛార్జ్‌ని స్టోర్ చేయగల సూపర్ కెపాసిటర్‌ను రూపొందించిన IISc పరిశోధకులు టెక్నాలజీ
    మొదటిసారిగా ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను గుర్తించిన నాసా JWST నాసా
    చంద్రునిపై ఉన్న గాజు పూసల లోపల నీటిని కనుగొన్న శాస్త్రవేత్తలు చంద్రుడు
    భవిష్యత్తులో అంగారక గ్రహంపై 'కాంక్రీట్' లాగా ఉపయోగపడనున్న బంగాళదుంపలు గ్రహం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023