NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి
    తదుపరి వార్తా కథనం
    తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి
    ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు

    తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి

    వ్రాసిన వారు Stalin
    Jan 30, 2023
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో గత 10నెలల్లో 111మంది శిశువులు అనుమానాస్పద కారణాలతో మరణించారు. ఈ మరణాలపై లక్నోలోని క్వీన్ మేరీ హాస్పిటల్ బృందం పరిశోధన చేయగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాజ్‌గంజ్‌లోని గర్భిణుల పాలల్లో పురుగుమందులు అవశేషాలను ఉండటం గమనార్హం.

    లక్నోలోని క్వీన్ మేరీ ఆసుపత్రి బృందం 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణుల నుంచి నమూనాలను సేకరించి శిశువుల మరణానికి గల కారణాలపై పరిశోధన చేసింది. ప్రొఫెసర్ సుజాతా దేవ్, డాక్టర్ అబ్బాస్ అలీ మెహందీ, డాక్టర్ నైనా ద్వివేది చేసిన పరిశోధన వివరాలు ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ జనరల్‌లో కూడా ప్రచురించారు.

    మాంసాహారుల కంటే శాఖాహారం తీసుకునే మహిళల పాలలో పురుగుమందుల అవశేషాలు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

    ఉత్తర్‌ప్రదేశ్

    శాఖాహారుల కంటే మాంసాహారుల్లో మూడు రెట్లు ఎక్కువ

    గర్భిణుల పాలల్లో పురుగు మందుల అవశేషాలు ఎందుకున్నాయనే దానిపై పరిశోనధన బృందం ఆరా తీయగా, రసాయన వ్యవసాయమే కారణమని తేలింది.

    కూరగాయలు, పంటల్లో వివిధ రకాల పురుగుమందులు, రసాయనాలను వినియోగిస్తారు. మాంసానికి వినియోగించే కోళ్లు, మేకలు, గొర్రెలు త్వరగా ఎదగడానికి సప్లిమెంట్లు, రసాయనాలను ఇంజెక్ట్ చేస్తారు. అందుకే మాంసాహారం తినే తల్లి పాలలో ఉండే పురుగుమందుల అవశేషాలు, శాఖాహార మహిళ కంటే మూడు రెట్లు ఎక్కువ అని మేరీ ఆసుపత్రి బృందం పరిశోధన తేల్చింది.

    శిశువుల మరణాలకు కారణం పురుగుమందుల అవశేషాలా? లేక మరేదైనా ఉండొచ్చా అనే కోణంలో విచారణ చేయడానికి సీడీఓ అధ్యక్షతన జిల్లా మేజిస్ట్రేట్ కమిటీని ఏర్పాటు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    పరిశోధన

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ

    పరిశోధన

    'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా ప్రపంచం
    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    పక్షి జాతి ఆవిర్భావం గురించి చెప్పే డైనోసార్ లాంటి తలతో ఉన్న శిలాజం చైనా
    ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం సూర్యుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025