LOADING...
Manipur: మణిపూర్'లో ఉద్రిక్తతలు..నిరసనకారులపై టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు ప్రయోగం
మణిపూర్'లో ఉద్రిక్తతలు..నిరసనకారులపై టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు ప్రయోగం

Manipur: మణిపూర్'లో ఉద్రిక్తతలు..నిరసనకారులపై టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు ప్రయోగం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కక్చింగ్ జిల్లాలో ఆదివారం రాత్రి భారీగా జరిగిన నిరసనలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు, స్టన్ గ్రెనేడ్లు ఉపయోగించారు. ఐదేళ్ల బాలుడు, ఐదు నెలల పాప మృతి చెందిన ఘటనకు న్యాయం చేయాలని స్థానికులు మీరా ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు కక్చింగ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు కక్చింగ్ కైతెల్ బ్రిడ్జి వద్ద అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జనాన్ని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు చర్యలు తీసుకోగా, అవసరానికి మించిన బలాన్ని ఉపయోగించారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

వివరాలు 

బిష్ణుపూర్‌లో సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి

ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని సమాచారం ఉన్నప్పటికీ... ప్రాంతంలో మాత్రం ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏప్రిల్ 7న బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం, వారి తల్లి గాయపడడం ఈ నిరసనలకు కారణమైంది. మోయిరాంగ్ ప్రాంతంలో ఇంటిపై మిలిటెంట్లు పేలుడు పదార్థం విసరడంతో ఈ ఘటన జరిగింది. ఈ దారుణాన్ని ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఖండించి, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది. కొందరు ఆందోళనకారులు ఆయిల్ ట్యాంకర్లు, వాహనాలకు నిప్పంటించారు. బిష్ణుపూర్‌లో సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి జరగగా, ఇద్దరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు.

Advertisement