NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు
    తదుపరి వార్తా కథనం
    Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు
    ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి: మోదీ

    Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు

    వ్రాసిన వారు Stalin
    Feb 26, 2023
    02:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వచ్ఛ భారత్ అభియాన్‌లో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 98వ 'మన్ కీ బాత్' ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక అంశాలపై మాట్లాడారు.

    'మన్ కీ బాత్'లో హర్యానా యువత చేస్తున్న స్వచ్ఛతా ప్రచారాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. హర్యానాలో దుల్హేడి గ్రామ యువకులు భివానీ నగరాన్ని శుభ్రం చేసేందుకు చేస్తున్న కృషిని మోదీ అభినందించారు.

    ఒడిశాలోని కేంద్రపాడ జిల్లా నివాసి కమలా ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందం గురించి మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్లాస్టిక్ వస్తువులు, సంచులతో ఈ బృందం బుట్టలు, మొబైల్ స్టాండ్‌లు తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో దేశ ప్రజలు క్లాత్ బ్యాగ్‌లను వినియోగించాలని ప్రధాని మోదీ కోరారు.

    మన్ కీ బాత్'

    'త్రిబేణి కుంభో మోహోత్సవ్' పునరుద్ధరణపై మోదీ హర్షం

    భారతీయ బొమ్మల గురించి కూడా ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో చెప్పారు. భారతీయ బొమ్మలతో పాటు అవి చెప్పే కథ రూపాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ బొమ్మలకు విదేశాల్లో కూడా డిమాండ్ పెరిగిపోయిందని ప్రధాని చెప్పారు.

    పశ్చిమ బెంగాల్‌లోని బాన్స్‌బేరియాలో 'త్రిబేణి కుంభో మోహోత్సవ్' పునరుద్ధరణపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. 700 సంవత్సరాల క్రితం ఆపేసిన ఈ ఉత్సవాన్ని తిరిగి ప్రారంభించడంపై అభినందనలు తెలిపారు.

    స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభించాల్సి ఉందని, కానీ కుదరలేదని చెప్పారు. రెండేళ్ల క్రితం స్థానికులు 'త్రిబేని కుంభో పొరిచలోన శోమితి' ద్వారా పండగను మళ్లీ ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ వేడుక ఊపందుకున్నట్లు మోదీ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    నరేంద్ర మోదీ

    జేఎన్‌యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి దిల్లీ
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ
    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు ప్రధాన మంత్రి
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం

    ప్రధాన మంత్రి

    భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని పాకిస్థాన్
    జెసిండా ఆర్డెర్న్: న్యూజిలాండ్ ప్రధాని సంచలన ప్రకటన, వచ్చే నెలలో పదవికి రాజీనామా న్యూజిలాండ్
    ప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది' నరేంద్ర మోదీ
    న్యూజిలాండ్ కొత్త ప్రధాని: జెసిండా ఆర్డెర్న్ స్థానంలో 'క్రిస్ హిప్‌కిన్స్' ఎన్నిక న్యూజిలాండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025