NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్‌ భేటీ; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక అంశాలపై చర్చ
    ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్‌ భేటీ; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక అంశాలపై చర్చ
    భారతదేశం

    ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్‌ భేటీ; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక అంశాలపై చర్చ

    వ్రాసిన వారు Naveen Stalin
    February 25, 2023 | 03:42 pm 1 నిమి చదవండి
    ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్‌ భేటీ; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక అంశాలపై చర్చ
    ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్‌ భేటీ

    రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం భారత్‌కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి సంక్షోభాలు ప్రపంచాన్ని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఎలా ప్రభావితం చేశాయనే దాని గురించి మాట్లాడుకున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ, ట్రేడ్, కొత్త టెక్నాలజీల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ఇరువురు నేతల చర్చల అనంతరం ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచి చెబుతోందని స్పష్టం చేశారు.

    రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయ్: ప్రధాని

    ప్రధాని మోదీ-ఓలాఫ్‌ స్కోల్జ్‌ మధ్య జరిగిన చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధాని మాటల ద్వారా స్పష్టమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని ప్రధాని మోదీ చెప్పారు. 'మేక్ ఇన్ ఇండియా', ఆత్మనిర్భర్ భారత్ కారణంగా నేడు అన్ని రంగాలలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఈ అవకాశాలపై జర్మనీకి ఉన్న ఆసక్తి భారత్‌ను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు గట్టి చర్య అవసరమని ఇరు దేశాలు అంగీకరిస్తున్నాయని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై ముందు రోజు స్కోల్జ్ స్పందించారు. జర్మనీ, భారతదేశం మధ్య సంబంధాలను తాము మరింత బలోపేతం చేస్తామని స్కోల్జ్ చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    జర్మనీ
    భారతదేశం

    నరేంద్ర మోదీ

    మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని నాగాలాండ్
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ
    మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి గుజరాత్

    జర్మనీ

    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి విమానం
    ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు అదిరిపోయే డిజైన్ తో రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ ఆటో మొబైల్
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం! ఉక్రెయిన్

    భారతదేశం

    భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2 ఆటో మొబైల్
    ఫిబ్రవరి 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం వ్యాపారం
    భారతదేశంలో BS6 ఫేజ్ 2: వివరంగా RDE, OBD 2 నిబంధనలు తెలుసుకుందాం ఆటో మొబైల్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023