NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!
    కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!

    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 03, 2025
    10:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ బ్యాంకు దోపిడీ వెలుగులోకి వచ్చింది.

    విజయపుర జిల్లాలోని మంగోలి గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకు శాఖ నుంచి దొంగలు ఏకంగా 59 కిలోల బంగారాన్ని అపహరించడం తీవ్ర కలకలానికి దారితీసింది.

    మే 24, 25 తేదీలను బ్యాంకు సెలవుల నేపథ్యంలో మూసివేయగా, మే 26న ప్యూన్ వచ్చి షట్టర్ తాళాలు పగలగొట్టబడినట్లు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

    వెంటనే అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలన చేపట్టారు.

    విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ్ బీ. నింబర్గి ఈ దోపిడీని ధృవీకరిస్తూ, దొంగలు బ్యాంకులోకి ప్రవేశించి బంగారం అపహరించారని స్పష్టం చేశారు.

    Details

    దర్యాప్తు కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు

    దొంగిలించిన బంగారం మొత్తం 59 కిలోలు కాగా, ఇవి బ్యాంకు సొంతంగా కాకుండా గ్రాహకులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలే అని తెలిపారు.

    ఈ ఘటనతో తాకట్టు పెట్టిన ఖాతాదారులలో తీవ్ర ఆందోళన నెలకొంది.

    పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ దోపిడీ మే 24 అర్ధరాత్రి నుంచి మే 25 రాత్రి మధ్యలో జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

    ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

    వీటిలోని బృందాలు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ, చోరీ జరిగిన సమయంలో అనుమానాస్పద కదలికలపై దృష్టి సారించాయి. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

    Details

    రికవరీ కోసం ప్రయత్నిస్తున్న అధికారులు

    ఈ ఘటన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత భారీ బ్యాంకు దోపిడీల్లో ఒకటిగా నమోదు కాగా, దోషులను త్వరగా పట్టుకుని బంగారం రికవరీ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు.

    మరోవైపు, ఈ ఘటనతో బ్యాంకుల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకం నెలకొనగా, భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కర్ణాటక

    HMPV: గుజరాత్‌లో రెండు సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ.. ధ్రువీకరించిన డాక్టర్లు గుజరాత్
    HMPV Virus: బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన సిద్ధరామయ్య
    Bidar: బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం.. ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్ భారతదేశం
    Karnataka: కర్ణాటక బీజేపీలో చీలికలు.. రాష్ట్ర అధ్యక్షుడిపై గోకాక్ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025