NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు 
    తదుపరి వార్తా కథనం
    Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు 
    Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు

    Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు 

    వ్రాసిన వారు Stalin
    Feb 11, 2024
    06:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.

    ఫిబ్రవరి 18నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసింది.

    మేడారం వచ్చే వాహనాలకు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా, రద్దీని నియంత్రించడమే కాకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం 14వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసింది.

    ఐజీ డాక్టర్ తరుణ్ జోషి మహాజాతరకు సంబంధించిన భద్రతపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

    20మంది ఎస్పీలు, 42మంది ఏఎస్పీలు, 140మంది డీఎస్పీలు, 400మంది సీఐలు, 1000మంది ఎస్సైలు, దాదాపు 12వేల మంది కానిస్టేబుళ్లకు మేడార జాతర విధుల్లో పాల్గొంటున్నారు.

    మేడారం

    500లకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు

    మేడారం జాతరకు కొన్ని లక్షల మందికి రానున్న నేపథ్యంలో రద్దీని అదుపు చేయడం పోలీసులకు కత్తిమీద సాములాంటిదే.

    అయితే.. మేడారం జాతరపై నిఘా ఉంటేందుకు పోలీసుల మోహరింపుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు.

    పరిసరాల్లో మొత్తం 500లకు పైగా సీసీ కెమెరాలను చేసినట్లు పోలీసులు తెలిపారు.

    కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి జాతరను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు ములుగు ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు.

    ఇదిలా ఉంటే, సమ్మక్-సారలమ్మను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రముఖులు రానున్నారు.

    దర్శనం కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

    జారత పరిసరాల నిరంతర పరిశుభ్రత కోసం 4,000మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. 14క్లస్టర్లలో 5,532మరుగుదొడ్లు, 230 కొత్త బోర్‌వెల్‌ల కూడా ఏర్పాటు చేశామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ములుగు
    తాజా వార్తలు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ములుగు

    Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం లోక్‌సభ
    Seethakka: త్వరలో 14వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క ఎమ్మెల్యే

    తాజా వార్తలు

    Vijay-Rajinikanth: రాజకీయాల్లోకి విజయ్‌ ఎంట్రీపై రజనీకాంత్‌ ఆసక్తికర కామెంట్స్  రజనీకాంత్
    ECI: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఓటరు జాబితా నుంచి 1.66 కోట్ల మంది పేర్లు తొలగింపు.. కారణం ఇదే  ఎన్నికల సంఘం
    UCC: సహజీవనానికి రిజిస్ట్రేషన్ లేకుంటే 6నెలు జైలు శిక్ష.. యూసీసీ బిల్లులో నిబంధనలు ఇవే.. ఉత్తరాఖండ్
    NCP vs NCP: శరద్ పవార్‌కు షాక్.. అజిత్ గ్రూపునే అసలైన ఎన్‌సీపీగా గుర్తించిన ఎన్నికల సంఘం అజిత్ పవార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025