NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట
    తదుపరి వార్తా కథనం
    Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట
    Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట

    Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 03, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ (NDSA) సంచలన నివేదిక బహిర్గతం చేసింది.

    ప్లానింగ్, డిజైన్,క్వాలీటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో వైఫల్యం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందనే నిర్దారణకు వచ్చినట్లు వెల్లడించింది.

    బ్యారేజ్ ఫెయిలైన కారణంగా ప్రజా జీవితానికి, ఆర్దిక వ్యవస్థకు పెను ముప్పు అని అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది.ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీని వినియోగించే అవకాశం లేదని నివేదకలో తేల్చేసింది.

    ఈ మేరకు బ్యారేజీ ప్లానింగ్, డిజైన్ సరైన రీతిలో లేదని స్పష్టం చేసింది.మొత్తం బ్యారేజీని పునాదుల నుంచి తొలగించి మళ్లీ కొత్తగా నిర్మించాలని కుండబద్దలు కొట్టింది.

    అటు అన్నారం,సుందిళ్ల బ్యారేజీలు ఇలాంటి ముప్పు బారిన పడే అవకాశముందని హెచ్చరించింది.

    details

    నిర్లక్ష్యం కారణంగా బ్యారేజీ క్రమేపీ బలహీనమైపోయింది : NDSA

    డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బ్యారేజీ క్రమేపీ బలహీనమైపోయిందని నివేదికలో పొందుపర్చింది.

    ఇదే సమయంలో బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, బేస్ మెంట్ మెటీరియల్ నాణ్యతలేమీ, సామర్థ్యత లేమీగా ఉన్నాయని చెప్పింది.

    బ్యారేజీ లోడ్ వల్ల ఎగువ ప్రాంతంలోని కాంక్రీట్ పైల్స్ బలహీన పడి పిల్లర్స్ సపోర్డ్ కుంగిపోయిందని నివేదికలో రాసుకొచ్చింది.

    మరోవైపు కమిటీ కోరిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదని, 20 అంశాలు అడిగితే కేవలం 12 మాత్రమే చెప్పినట్లు నివేదికలో వివరించింది.

    పిల్లర్లు కుంగిపోవటానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడమే కారణమని NDSA తెలిపింది. ప్రస్తుత దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజీ మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని నివేదిక ద్వారా తెల్చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    తెలంగాణ
    కాళేశ్వరం ప్రాజెక్టు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కేంద్ర ప్రభుత్వం

    హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం  హిమాచల్ ప్రదేశ్
    పోస్టాఫీసుల్లో కీలక మార్పులు.. సేవింగ్స్ ఖాతాదారులకు ముఖ్యగమనిక పోస్టల్ డిపార్ట్మెంట్
    ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం  బిజినెస్
    Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు  ఎగుమతి సుంకం

    తెలంగాణ

    గ్రూప్​-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దసరా తర్వాత జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా విడుదల టీఎస్పీఎస్సీ
    కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్  ధర్మపురి అరవింద్
    TS Elections: తెలంగాణలో పోటీపై రెండ్రోజుల్లో నిర్ణయం : జనసేన జనసేన
    BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు బీజేపీ

    కాళేశ్వరం ప్రాజెక్టు

    Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు అన్నారం బ్యారేజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025