NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ
    తదుపరి వార్తా కథనం
    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ
    మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ

    వ్రాసిన వారు Stalin
    Jan 06, 2023
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాలుగు రోజలు పర్యటన నిమ్మితం భారత్‌కు వచ్చారు . నాలుగో రోజైన శుక్రవారం నాదెళ్ల హైదరాబాద్‌కు రాగా.. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

    ఇద్దరు హైదరాబాదీలుసమావేశాన్ని ఈ రోజును ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు మంత్రి కేటీఆర్. సత్య నాదెళ్లతో బిజినెస్‌తో బిర్యానీ గురించి చర్చినట్లు ఆయన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇద్దరి మధ్య ప్రధానంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు కేంద్రం గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

    సత్య నాదెళ్ల

    అంతకుముందు మోదీతో భేటీ

    మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలుగువారు. హైదరాబాద్ నగరంలో జన్మించారు. అతను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. సత్య నాదెళ్ల తండ్రి నాదెళ్ల యుగంధర్ మాజీ ఐఏఎస్ అధికారి. మణిపాల్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత తదుపరి చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గతేడాది నాదెళ్లకు దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో కేంద్రం సత్కరించింది.

    ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌కు రావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీని సత్య నాదెళ్ల కలిశారు. డిజిటల్ ఇండియా విజన్‌తో ప్రపంచానికి భారత్ మార్గదర్శిగా మారడానికి తాము సాయం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా మోదీ సత్య నాదెళ్ల తో చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేటీఆర్ ట్వీట్

    Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella

    We chatted about Business Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS

    — KTR (@KTRTRS) January 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు
    Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం .. గూగుల్
    Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం చంద్రబాబు నాయుడు
    350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025