NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Miss World Pageant: మిస్‌ వరల్డ్‌ పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Miss World Pageant: మిస్‌ వరల్డ్‌ పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్  
    మిస్‌ వరల్డ్‌ పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్

    Miss World Pageant: మిస్‌ వరల్డ్‌ పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2025
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మే 7 నుంచి 31 వరకు హైటెక్స్‌ వేదికగా జరగబోయే "మిస్ వరల్డ్ 2025" పోటీలను పురస్కరించుకొని, నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భారీ సన్నాహాలు చేపట్టింది.

    ఈ క్రమంలో GHMC సుమారు రూ.1.79 కోట్ల బడ్జెట్‌తో అభివృద్ధి పనులకు నాంది పలికింది.

    హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలతో పాటు చార్మినార్, ట్యాంక్‌బండ్, రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా LED విద్యుత్ దీపాలు, థీమ్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, అలాగే ప్రపంచ సుందరి కిరీటం ఆకారంలో నమూనాలు ఏర్పాటు చేయనున్నట్లు GHMC వెల్లడించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

    వివరాలు 

    తెలంగాణ సచివాలయం వద్ద 20 దేశాల జెండాలు

    విమానాశ్రయం ప్రధాన రహదారి పక్కన 130 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను ఏర్పాటు చేయనున్నారు.

    అంతేకాక, "Miss World 2025" అనే బోల్డ్ అక్షరాలతో ఉన్న స్వాగత బోర్డులు ఏర్పాటు చేయడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

    తెలంగాణ సచివాలయం వద్ద ప్రత్యేకంగా 20 దేశాల జెండాలు ప్రదర్శించనున్నారు.

    దీని కోసం సుమారుగా రూ.28.96లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసారు.శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని దుర్గం చెరువు,ఏఎంబీ మాల్,గచ్చిబౌలి,రాయదుర్గం మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో సెల్ఫీ పాయింట్లు, స్వాగత ఆర్చులు, డాంగ్లర్స్, బంటింగ్స్, LED కిరీటం, ఫెయిరీ క్వీన్ వంటి అలంకరణలు ఏర్పాటు చేయడానికి రూ.34.10 లక్షలతో టెండర్లు పిలవబడ్డాయి.

    అదనంగా శిల్పారామం, బయోడైవర్సిటీ పార్కుల్లో విద్యుదీపాల అలంకరణ కోసం మరో రూ.28.32 లక్షలు వెచ్చించనున్నారు.

    వివరాలు 

    చార్మినార్ పరిసరాల కమాన్‌లు, రహదారులపై విద్యుద్దీపాలు 

    చార్మినార్ సమీపంలోని లాడ్‌బజార్ రహదారికి ప్రత్యేక డెకరేటివ్ లాంతర్ల లైటింగ్‌తో రూపురేఖలు మార్చనున్నారు.

    ఇందుకోసం రూ.11.60 లక్షలు ఖర్చు చేయనున్నారు. అలాగే చార్మినార్ పరిసరాల కమాన్‌లు, రహదారులపై విద్యుద్దీపాలను అమర్చనున్నారు.

    ఒక ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌ను కూడా అక్కడ ఏర్పాటు చేయనున్నారు.

    ట్యాంక్‌బండ్ ప్రాంతాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు రూ.42.48 లక్షలతో రంగురంగుల లైటింగ్ తోరణాలు ఏర్పాటు చేయనున్నారు.

    అదనంగా ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్క్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో మరో రూ.33.86 లక్షల వ్యయంతో LED విద్యుత్ దీపాల ప్రకాశంతో ప్రత్యేక శోభ కలిగించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    హైదరాబాద్

    Hyderabad Metro: ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలు.. 40 నిమిషాలే ప్రయాణం.. మెట్రో రైలు
    Pollution: హైదరాబాద్‌ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక  వాయు కాలుష్యం
    Nehru Zoo Park Ticket Price: పర్యాటకులకు బిగ్ షాక్‌.. హైదరాబాద్ జూపార్క్‌లో టికెట్, పార్కింగ్ ఛార్జీల పెంపు ఇండియా
    Amberpet Flyover: అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభం.. నగరవాసుల దశాబ్దాల కల నెరవేరింది! కిషన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025