Loading...
Madhya Pradesh: 'వ్యవస్థ నన్ను విఫలం చేసింది'.. వరుస బదిలీలపై మధ్యప్రదేశ్ ఐఏఎస్‌ అధికారి ఆవేదన
'వ్యవస్థ నన్ను విఫలం చేసింది'.. వరుస బదిలీలపై మధ్యప్రదేశ్ ఐఏఎస్‌ అధికారి ఆవేదన

Madhya Pradesh: 'వ్యవస్థ నన్ను విఫలం చేసింది'.. వరుస బదిలీలపై మధ్యప్రదేశ్ ఐఏఎస్‌ అధికారి ఆవేదన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి నేహా మార్వ్య సింగ్‌ ఏడాదిలోనే నాలుగుసార్లు బదిలీ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా బదిలీ.. ఆమె బాధ్యతలు చేపట్టిన 50 రోజులకే జరగడం గమనార్హం. తన కిందిస్థాయి సిబ్బంది తనపై 'తిరుగుబాటు' చేశారని, దీంతో తాను అవమానానికి గురయ్యానని మధ్యప్రదేశ్‌ ఐఏఎస్‌ అధికారుల సంఘానికి పంపిన సందేశంలో ఆమె పేర్కొన్నారు.

వివరాలు 

'తిరుగుబాటు కారణంగానే బదిలీ'

తనపై కిందిస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా 'తిరుగుబాటు' చేశారని నేహా మార్వ్య సింగ్‌ ఆరోపించారు.

బదిలీ చేస్తామంటూ వారు తనను బెదిరించారని తెలిపారు. ఇలాంటి చర్యలకు ఒక ఐఏఎస్‌ అధికారి కూడా ఇంత బలహీనంగా మారాల్సి వస్తుందా? అని ప్రశ్నించారు.

శాఖ పరిధిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది నాపై తిరుగుబాటు చేశారు. నా డెస్క్‌పై చేతులతో కొడుతూ.. నన్ను బదిలీ చేయిస్తామని బెదిరించారు. చివరకు అదే జరిగింది'' అని ఆమె పేర్కొన్నారు.

వివరాలు 

'నా పదవీకాలం కొన్ని నెలలకే పరిమితం'

తనకు పదేపదే తక్కువ కాలానికే బాధ్యతలు అప్పగిస్తుండటంపై కూడా సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకుని సమర్థంగా నిర్వహించేలోపే బదిలీ అవుతున్నానని తెలిపారు.

''నేను ఎలా పనిచేయాలి? నా పదవీకాలం కొన్ని నెలలకే పరిమితమవుతోంది. బాధ్యతలు అర్థం చేసుకునేలోపే నన్ను తొలగిస్తున్నారు'' అని ఆమె అన్నారు.

కిందిస్థాయి సిబ్బంది విధులకు సహకరించకపోవడం, ఫైళ్లను కావాలనే నిలిపివేయడం, తనను సరిగా చూడకపోవడం వంటి విషయాలను అధికారిక మార్గాల్లో ఫిర్యాదు చేసినప్పటికీ.. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

సింగ్‌ ఒక్కరే కాదు..

నేహా సింగ్‌ వ్యవహారం ప్రభుత్వ సర్వీసులోని కొన్ని సమస్యలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

ఇతర అధికారులు సైతం ప్రభుత్వ ఉద్యోగాలను వీడుతున్న సందర్భాలు ఇటీవల కనిపిస్తున్నాయి.

13 ఏళ్లపాటు ఐఏఎస్‌గా పనిచేసిన దివ్య మిట్టల్‌ ఇటీవల రాజీనామా చేశారు.

మరో మాజీ ఐఏఎస్‌ అధికారి రోమన్‌ సైనీ సైతం బ్యూరోక్రసీని వీడి ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీని సహవ్యవస్థాపకుడిగా ప్రారంభించారు.

వరుస బదిలీల కారణంగా తన కిందిస్థాయి సిబ్బంది దృష్టిలో తాను 'సులభమైన లక్ష్యం'గా మారిపోయానని సింగ్‌ ఆరోపించారు.

''కుట్రలు చేసేవారే ఎప్పుడూ గెలుస్తున్నారు.. నేను విఫలమవుతున్నాను. వ్యవస్థ నన్ను విఫలం చేసింది'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT