NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NCERT: ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానంలో 'భారత్'.. ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు 
    తదుపరి వార్తా కథనం
    NCERT: ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానంలో 'భారత్'.. ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు 
    ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానంలో 'భారత్'.. ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు

    NCERT: ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానంలో 'భారత్'.. ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు 

    వ్రాసిన వారు Stalin
    Oct 25, 2023
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానాన్ని 'భారత్' పేరుతో భర్తీ చేయాలనే ప్రతిపాదనను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

    దీంతో కొత్త అకడమిక్ సెషన్ నుంచి 'ఇండియా' అనే పదం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలలో కనిపించదు.

    వాస్తవానికి ఈ ప్రతిపాదన చాలా నెలల క్రితం ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ ప్రతిపాదనను అధికారికంగా ఆమోదించలేదు. తాజాగా కమిటీ ఆమోదించింది.

    మరికొన్ని సిఫార్సులను కమిటీ చేసింది. ముఖ్యంగా పాఠ్యపుస్తకాల్లో 'ప్రాచీన చరిత్ర'కి బదులుగా 'క్లాసికల్ హిస్టరీ' అని రాయాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సిఫార్సు చేసింది.

    దీంతో ఇకపై చరిత్రను పురాతన, మధ్యయుగ, ఆధునికంగా విడివిడిగా చదవలేరు.

    ఇండియా

    హిందూ రాజుల విజయాలపై పాఠ్యపుస్తకాల్లో అధ్యాయాలు

    బ్రిటిష్ పాలకులు భారతీయ చరిత్రను ప్రాచీన, మధ్యయుగ, ఆధునికంగా విభజించారని కమిటీ వాదించింది.

    పాఠ్యపుస్తకాలలో 'హిందూ రాజుల విజయాలు' అనే అధ్యాయాలను చేర్చాలని, అన్ని సబ్జెక్టుల సిలబస్‌లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకేఎస్)ని చేర్చాలని కూడా కమిటీ పేర్కొంది.

    కమిటీ ముందు ఉంచిన ఈ సిఫార్సులను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

    కమిటీ చేసిన ఈ మార్పులు త్వరలో అన్ని NCERT పుస్తకాలలో కనిపిస్తాయి.

    ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లో మార్పులపై కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు.

    ఈ చర్యను ముందే ఊహించినట్లు చెప్పారు. దేశం పేరును మార్చడానికి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025