NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపుపై రగడ.. స్పందించిన NCERT
    తదుపరి వార్తా కథనం
    పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపుపై రగడ.. స్పందించిన NCERT
    ఎన్సీఆర్టీపై విమర్శల పర్వం

    పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపుపై రగడ.. స్పందించిన NCERT

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 02, 2023
    03:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెన్త్ క్లాస్ లో సైన్స్‌ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌ ను తొలగించడంపై ఎన్సీఆర్టీపై విమర్శల పర్వం మొదలైంది. హుటాహుటిన స్పందించిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఆయా మాటల దాడులకు బదులిచ్చింది.

    స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్ నుంచి దీన్ని మొత్తానికే తీసేయలేదని వెల్లడించింది. 11, 12వ తరగతుల్లో ఈ సిలబస్ అంతా ఉంటుందని సమర్థించుకుంది.

    సిలబస్‌ హేతుబద్ధీకరణలో భాగంగా టెన్త్ క్లాస్ లో మరిన్ని సబ్జెక్టులను తొలగించినట్లు కౌన్సిల్ వివరించింది.

    సైన్స్ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌, ఇంధన మూలకాలు, సహజ వనరుల నిర్వహణ, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌ - 1 నుంచి ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు వంటి పాఠాలను తొలగించింది.

    Details

    కొవిడ్ కారణంగానే హేతుబద్ధీకరించాం : ఎన్సీఆర్టీ

    ఇండియాలో సైన్స్ ను కంపల్సరీ సబ్జెక్టుగా బోర్డ్ ఎగ్జామ్ అయిన టెన్త్ క్లాస్ వరకు మాత్రమే బోధిస్తారు. అనంతరం సైన్స్ గ్రూప్‌ చదివే స్టూడెంట్స్ కు మాత్రమే తొలగించిన సబ్జెక్టులను చదివే అవకాశం ఉంటుంది.

    ఫలితంగా కీలకమైన పిరియాడిక్‌ టేబుల్‌ పాఠ్యాంశాన్ని పదో తరగతి సైన్స్ బుక్ నుంచి తీసేయడంపై ప్రోఫెషనల్స్ , సైంటిస్టులు ఖండించారు.

    వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని దగ్గర దగ్గర 1800 మందికిపైగా మేధావులు, నిపుణులు కౌన్సిల్ కు బహిరంగ లేఖ రాయగా, అది కాస్తా చినికి చినికి గాలివానలా తయారైంది.

    ఈ క్రమంలోనే విమర్శలపై కౌన్సిల్ స్పందిస్తూ కొవిడ్ కాలంలో స్టూడెంట్స్ విలువైన సమయాన్ని కోల్పోయారని, అందుకే వారిపై భారం పడకూడదనే సిలబస్‌ను హేతుబద్ధీకరించామని వివరణ ఇచ్చుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విద్యార్థులు
    విద్యా శాఖ మంత్రి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    విద్యార్థులు

    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యా శాఖ మంత్రి
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ

    విద్యా శాఖ మంత్రి

    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025