NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్‌ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య 
    తదుపరి వార్తా కథనం
    Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్‌ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య 
    Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్‌ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య

    Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్‌ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2023
    08:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 28కి చేరుకుంది.

    విద్యార్థిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫౌరీద్ హుస్సేన్‌గా గుర్తించారు. నగరంలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తన అద్దె గదిలో నీట్ విద్యార్థి హుస్సేన్ ఉరివేసుకుని కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

    వివరాలలోకి వెళితే.. హుస్సేన్‌ మరికొందరు విద్యార్థులతో కలిసి ఆ వసతిగృహంలో ఉంటున్నాడు.

    దాదాపు సాయంత్రం 4 గంటలకు హుస్సేన్‌ను చివరిసారిగా చూశామని, ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు అతని గది లోపలి నుండి తాళం వేసి ఉందని విద్యార్థులు తెలిపారు.

    Details 

    ఆందోళనకరంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు

    వారి కాల్‌లకు హుస్సేన్ స్పందించకపోవడంతో అతని స్నేహితులు ఇంటి ఓనర్ సహాయం కోరారు.

    పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు.

    విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు.

    కోటాలో గత కొన్ని నెలలుగా విద్యార్థుల ఆత్మహత్యల కేసులు ఆందోళనకరంగా పెరుగుతూనే ఉన్నాయి.

    ఇది స్థానిక అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. అధికారులు ఇప్పుడు అన్ని కోచింగ్ సెంటర్‌లలో సీలింగ్ ఫ్యాన్‌లలో యాంటీ-హాంగింగ్ పరికరాలను అమర్చడాన్ని తప్పనిసరి చేశారు.

    రెండు నెలల పాటు ఎటువంటి పరీక్షలు నిర్వహించకూడదని ఇన్‌స్టిట్యూట్‌లకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    ఆత్మహత్య

    తాజా

    Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ! సమంత
    Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం జార్జియా
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ
    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు

    రాజస్థాన్

    రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు బీజేపీ
    చంద్రయాన్-3 వ్యోమగాములకు శుభాకాంక్షలు చెప్పిన రాజస్థాన్ మంత్రి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు చంద్రయాన్-3
    రాజస్థాన్​లో ఘోరం.. చంద్రయాన్-3 విజయాన్ని ఆస్వాదిస్తున్న స్టూడెంట్స్‌పై కశ్మీరీ విద్యార్థుల దాడి యూనివర్సిటీ
    రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త మహిళ

    ఆత్మహత్య

    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  ముంబై
    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  తెలంగాణ
    రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య రాజస్థాన్
    అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది?  అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025