Nirav Modi: నీరవ్ మోదీ అప్పగింతకు మార్గం సుగమం.. తుది దశలో ప్రక్రియ
ఈ వార్తాకథనం ఏంటి
నీరవ్ మోదీని భారత్కు అప్పగించే ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంకులను భారీగా మోసగించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు రప్పించే దిశగా పురోగతి కనిపిస్తోంది. భారత్కు అప్పగింతను నిలువరించేందుకు యునైటెడ్ కింగ్డమ్లో అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను నీరవ్ మోదీ వినియోగించుకున్నారు. అయితే అక్కడ ఆయనకు ఆశించిన ఫలితం దక్కలేదు. అనంతరం చివరి ప్రయత్నంగా యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ను ఆశ్రయించినా అక్కడ కూడా ఉపశమనం లభించలేదు.
వివరాలు
భారత్ చేపట్టిన అప్పగింత చర్యలకు మరింత ఊతం
దీంతో నీరవ్ మోదీని భారత్కు అప్పగించే ప్రక్రియను యూకే అధికారులు ప్రారంభించినట్లు సమాచారం. ఈ పరిణామం భారత్ చేపట్టిన అప్పగింత చర్యలకు మరింత ఊతమిచ్చినట్లుగా భావిస్తున్నారు. 2019 మార్చి నుంచి లండన్లోని జైలులో ఉన్న నీరవ్ మోదీపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణ మోసంతో పాటు మనీలాండరింగ్ కేసుల్లో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుల్లో విచారణ నిమిత్తం ఆయనను భారత్కు రప్పించేందుకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చాలా కాలంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.