Page Loader
GVMC: జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి
జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి

GVMC: జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. శనివారం ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పైన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షత వహించారు. మొత్తం 74 మంది కూటమి కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరైయ్యారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో, హాజరైన 74 మంది సభ్యులందరూ ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఫలితంగా, మేయర్‌గా ఉన్న గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. ఈ విజయంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం అధికారంగా చేపట్టింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జనసేన పార్టీ చేసిన ట్వీట్