Page Loader
Supreme Court: 'ప్రజాస్వామ్యంలో పోలీసు రాజ్యం వద్దు'.. సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
'ప్రజాస్వామ్యంలో పోలీసు రాజ్యం వద్దు'.. సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

Supreme Court: 'ప్రజాస్వామ్యంలో పోలీసు రాజ్యం వద్దు'.. సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2025
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రయల్ కోర్టుల పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తయిన తరువాత కూడా చాలా సాధారణ కేసుల్లో బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం తప్పని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలో పోలీసుల రాజ్యంలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని హితవు పలికింది. ఒక చిన్న కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా వ్యవహరించకూడదు. చట్ట అమలుశాఖలు కొన్నిసార్లు నిజాలకు సంబంధం లేకుండా వ్యక్తులను నిర్భందించేందుకు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఇది అసహ్యకరమైన విషయం. రెండు దశాబ్దాల క్రితం, చిన్నచిన్న కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల వద్దకు రావడం చాలా అరుదుగా ఉండేది.

Details

న్యాయవ్యవస్థపై అనవసరంగా భారం పడుతోంది

కానీ ఇప్పుడు ట్రయల్ కోర్టులు పరిష్కరించాల్సిన బెయిల్ కేసులు సుప్రీంకోర్టు వరకు రావడం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల న్యాయవ్యవస్థపై అనవసరంగా భారం పడుతోందని జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక, ఒక చిన్న కేసులో రెండేళ్లకు పైగా కస్టడీలో ఉన్న నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయి, ఛార్జిషీట్ దాఖలైనప్పటికీ ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయి . మేజిస్ట్రేట్లు విచారించగలిగే కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్లు నేరుగా సుప్రీంకోర్టు ఎదుటకు రావడం దురదృష్టకరమని అభయ్ ఎస్. ఓకా వ్యాఖ్యానించారు.