NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chirag Paswan: అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chirag Paswan: అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన
    అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన

    Chirag Paswan: అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 30, 2025
    03:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి, ఎన్డీఏ మిత్రపక్ష నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు.

    ఇటీవల యూపీ పోలీసులు వీధుల్లో నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేయగా, ఈ ఆదేశాలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

    ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిని విలేకర్లు ప్రశ్నించగా, ఇది 'పనికిరాని చర్చ' అంటూ ఆయన తోసిపుచ్చారు. దేశంలో చర్చించాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి.

    అనేక ప్రధాన సమస్యలు ఉండగా, దీనిపై చర్చ అవసరమా అని ప్రశ్నించారు.

    ఎన్నో ఏళ్లుగా వీధుల్లో నమాజ్ చేస్తుండగా, ఇప్పుడు దీనిపై చర్చ ఎందుకు తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు.

    Details

    అసంబద్ధమైన చర్చలు సమాజానికి హానికరం

    చర్చ అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టడం వల్ల సమాజంలో ఉద్రిక్తత పెరుగుతుందని చిరాగ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.

    ఏ కారణం లేకుండానే సంఘాలు, ప్రజల మధ్య చీలికలు రావచ్చు.

    అందుకే ఇలాంటి చర్చలు అర్థరహితంఅని స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా తన పనితీరును ప్రశ్నించవచ్చు,

    కానీ మతపరమైన అంశాలపై మాట్లాడడం వల్ల అపార్థాలు మాత్రమే ఏర్పడతాయని అన్నారు.

    Details

    వ్యక్తిగత విశ్వాసం - ప్రతి ఒక్కరికి హక్కే

    బీజేపీలోని కొంత మంది వీధుల్లో నమాజ్ చేయడాన్ని వ్యతిరేకించినప్పటికీ, తన వ్యక్తిగత అభిప్రాయం భిన్నమని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.

    తాను 21వ శతాబ్దానికి చెందిన విద్యావంతుడిని. మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం భావ్యం కాదని భావిస్తున్నానని అన్నారు.

    బీజేపీ మిత్రపక్షంగా ఉన్నా, మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని స్పష్టం చేశారు.

    తాను కూడా ఇఫ్తార్ విందుకు హాజరైనప్పుడు తిలకం పెట్టుకున్నానని, అది తన వ్యక్తిగత విశ్వాసమన్నారు.

    అదే విధంగా, ఇతరుల మత విశ్వాసాన్ని గౌరవిస్తూనే, తన మత విశ్వాసాన్ని మరిచిపోనని ఆయన స్పష్టం చేశారు.

    హిందూ-ముస్లింల గురించి మాట్లాడటం కంటే, దేశంలో పరిష్కరించాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి. వాటిపై చర్చిస్తే మంచిదని హితవు పలికారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్రమంత్రి
    ఇండియా

    తాజా

    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్

    కేంద్రమంత్రి

    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి
    కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం  అర్జున్ రామ్ మేఘవాల్
    మొబైల్ గేమర్లకు గుడ్ న్యూస్.. ఇండియాలోకి BGMI గేమ్ రీ ఎంట్రీ గేమ్
    డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విద్యా శాఖ మంత్రి

    ఇండియా

    Uttarakhand: ఉత్తరాఖండ్ విషాదం.. నలుగురు మృతి, ఐదుగురి కోసం గాలింపు ఉత్తరాఖండ్
    #NewsBytesExplainer: దేశాధినేతల మధ్య చెలరేగిన ఘర్షణలు.. చరిత్రలో నిలిచిపోయిన మాటల యుద్ధాలివే! జెలెన్‌స్కీ
    Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్‌.. ఆకాశ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తొలగింపు  మాయావతి
    Mohan Yadav: మధ్యప్రదేశ్ రైతులకు శుభవార్త.. రూ.5కే శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌ మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025