NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jamili Elections bill: నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. బిల్లులో నిబంధన
    తదుపరి వార్తా కథనం
    Jamili Elections bill: నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. బిల్లులో నిబంధన
    నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. బిల్లులో నిబంధన

    Jamili Elections bill: నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. బిల్లులో నిబంధన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    08:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

    అనంతరం ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపే అవకాశం ఉంది.

    సోమవారం రాత్రి ఈ బిల్లును లోక్‌సభ అంశాల జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును 'ఒకే దేశం,ఒకే ఎన్నిక'పేరుతో సభలో ప్రవేశపెట్టి, స్పీకర్‌ను సంయుక్త పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేయాలని కోరతారు.

    పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను ఈ సంఘంలో నియమించనున్నారు.

    అతి పెద్ద పార్టీ అయిన బీజేపీకి ఈ సంఘం ఛైర్మన్‌ పదవి లభిస్తుంది.

    అదే రోజు స్పీకర్ సభ్యుల నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.

    వివరాలు 

    కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2024 

    పార్టీలు సభ్యుల పేర్లను సూచించకపోతే వారు సభ్యత్వాన్ని కోల్పోతారు. ఈ సంఘం పదవీకాలం తొలుత 90 రోజులు కాగా, అవసరమైతే పొడిగించే అవకాశముంది.

    గత వారం కేంద్ర క్యాబినెట్ జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది.

    వీటిలో రాజ్యాంగ సవరణ బిల్లు తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2024 కూడా ఉంది.

    ఈ బిల్లు దిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది.

    ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటు జరగలేకపోతే, ఆ తర్వాత వీలైన సమయంలో నిర్వహించే అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది.

    వివరాలు 

    బీజేపీ ఎంపీలకు విప్‌ జారీ

    ఇందుకోసం రాష్ట్రపతి ఆదేశాలు అవసరం. ఎన్నికల సంఘం ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని భావించిన సందర్భంలో, వాటిని తర్వాత నిర్వహించేందుకు రాష్ట్రపతికి సిఫార్సు చేసే అధికారం 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సెక్షన్ 2 క్లాజ్‌ 5లో పేర్కొంది.

    ఇదిలా ఉండగా, బీజేపీ తన లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని, ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనున్న నేపథ్యంలో మంగళవారం అందరూ హాజరుకావాలని సూచించింది.

    ఈ మేరకు బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్‌ మూడు లైన్ల విప్‌ విడుదల చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమిలి ఎన్నికలు

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    జమిలి ఎన్నికలు

    One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ  అసెంబ్లీ ఎన్నికలు
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్  రాహుల్ గాంధీ
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025