NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Draupadi Murmu: వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ దేశానికి మేలు చేస్తుంది: రాష్ట్రపతి 
    తదుపరి వార్తా కథనం
    Draupadi Murmu: వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ దేశానికి మేలు చేస్తుంది: రాష్ట్రపతి 
    వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ దేశానికి మేలు చేస్తుంది: రాష్ట్రపతి

    Draupadi Murmu: వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ దేశానికి మేలు చేస్తుంది: రాష్ట్రపతి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 26, 2025
    02:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

    ఈ బిల్లు కోసం ప్రత్యేకంగా జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్షం ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణిస్తుండగా, కేంద్రం మాత్రం జమిలి ఎన్నికల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటోంది.

    ఈ తరుణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఇది సుపరిపాలనకు కొత్త నిర్వచనాన్ని ఇస్తుందని, దేశానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.

    పాలనలో సుస్థిరతను అందించడంతో పాటు విధానాల్లో అనిశ్చితిని తొలగించడానికి, వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

    Details

     జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము

    76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

    గత 75 ఏళ్లలో దేశం సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, సుసంపన్న, సమ్మిళిత భారత్‌ను సాకారం చేసేందుకు ప్రతి పౌరుడు పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు.

    భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచ ఆర్థిక ధోరణులను ప్రభావితం చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.

    అలాగే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దూసుకుపోతోందని, అంతరిక్ష రంగంలో దేశానికి మరింత పేరు తెచ్చిందని తెలిపారు.

    భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తన స్థాయిని మెరుగుపరుచుకుంటూ 2020లో 48వ స్థానం నుండి 2024లో 39వ స్థానానికి చేరుకుందని రాష్ట్రపతి వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ద్రౌపది ముర్ము
    రాష్ట్రపతి

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    ద్రౌపది ముర్ము

    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి

    రాష్ట్రపతి

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం
    బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు తెలంగాణ
    నెల్లుట్ల సర్పంచ్‌కు జాతీయస్థాయి పురస్కారం; రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగం  జనగామ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025