NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cyber attacks: భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్‌ సైబర్ గ్రూపులు దాడులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Cyber attacks: భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్‌ సైబర్ గ్రూపులు దాడులు
    భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్‌ సైబర్ గ్రూపులు దాడులు

    Cyber attacks: భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్‌ సైబర్ గ్రూపులు దాడులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    07:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ కౌంటర్ చర్యలు చేపడుతుండటంతో పాకిస్థాన్‌ అసహనం వ్యక్తం చేస్తోంది.

    ప్రత్యక్షంగా ప్రతీకారం తీర్చలేకపోయిన దాయాది దేశం ఇప్పుడు సైబర్ దాడుల రూపంలో భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది.

    ఈ క్రమంలో పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ ముఠాలు భారత రక్షణ రంగానికి చెందిన కీలక వెబ్‌సైట్లపై దాడులకు పాల్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

    సైనిక ఇంజినీరింగ్ సేవలు (మిలిటరీ ఇంజినీర్‌ సర్వీసెస్‌), అలాగే మనోహర్ పారికర్ డిఫెన్స్ అండ్ అనాలిసిస్ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించిన సున్నతమైన సమాచారం పాకిస్థాన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్టు వారు తమ 'పాకిస్థాన్‌ సైబర్ ఫోర్స్ ఎక్స్‌' పేరిట ప్రకటించారు.

    వివరాలు 

    ఆన్‌లైన్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేసి..

    అంతేకాదు, రక్షణ శాఖ పరిధిలో పని చేస్తున్న 'ఆర్మ్డ్ వెహికిల్‌ నిగమ్ లిమిటెడ్‌' వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయాలని ప్రయత్నించామని ప్రకటించడంతో పాటు దానికి సంబంధించిన చిత్రాలను కూడా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

    దీంతో ఆయా అధికార సంస్థలు తమ ఆన్‌లైన్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేసి, ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నాయి.

    ఇక మరోవైపు, ఇటువంటి దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకోవడంలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ముమ్మరంగా కృషి చేస్తున్నారని సమాచారం.

    పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ దాడి అనంతరం భారత్‌లో సుమారు పది లక్షల సైబర్ దాడులు జరిగినట్టు మహారాష్ట్ర సైబర్ విభాగం రెండు రోజుల క్రితం వెల్లడించింది.

    వివరాలు 

    దాడిలో కీలకమైన ప్రభుత్వ డేటాను హ్యాకర్లు దొంగిలించారు 

    ఈ దాడులు పాకిస్థాన్‌తో పాటు ఇతర విదేశీ హ్యాకింగ్ గ్రూపుల నుంచి జరిగాయని వెల్లడించింది.

    అంతేకాదు, జమ్ము మున్సిపల్‌ కార్పొరేషన్‌పై కూడా సైబర్‌ దాడి జరగిందని అధికారులు తెలిపారు.

    ఈ దాడిలో కీలకమైన ప్రభుత్వ డేటాను హ్యాకర్లు దొంగిలించారని వెల్లడించారు. అనేక సర్టిఫికెట్లు కూడా ఈ దాడితో పోయినట్టు తెలిపారు.

    ప్రస్తుతం దెబ్బతిన్న వెబ్‌సైట్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

    ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సైబర్‌ సెక్యూరిటీ అప్రమత్తత్వాన్ని పెంచుతూ అలర్ట్ జారీ చేసింది.

    ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వాలయాలు, సంబంధిత ఏజెన్సీలన్నీ తమ సైబర్‌ రక్షణ వ్యవస్థలను మరింత బలంగా తీర్చిదిద్దుకోవాలని కేంద్రం సూచించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్‌ సైబర్ గ్రూపులు దాడులు

    Pakistan-based cyber attackers target Indian defence websites, surveillance heightened to mitigate future risks

    Read @ANI Story | https://t.co/6vYXCxvV0P #Cyberattackalert #Pakistan #IndianDefenceInstitutions pic.twitter.com/BeTCIczBss

    — ANI Digital (@ani_digital) May 5, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైబర్ నేరం

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025