NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్
    తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్

    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    07:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లోని ప్రార్థనా మందిరాలపై కూడా పాక్‌ లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.

    భారతదేశంపై దుష్ప్రచారానికి పాల్పడుతుందంటూ విమర్శించారు. తప్పుడు సమాచారం వ్యాప్తిలో పాక్‌కి ప్రసిద్ధి చెందిందని, తాజాగా నన్కానా సాహిబ్‌ గురుద్వారా ఘటనతో ఇది మరింత స్పష్టమైందన్నారు.

    ఆ గురుద్వారాపై భారత్‌ లక్ష్యంగా దాడి చేసిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఖండించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే నిందతో మతపరమైన రంగు వేసే ప్రయత్నం పాక్‌ చేస్తోందని ఆయన విమర్శించారు.

    గత గురువారం రాత్రి, పాకిస్థాన్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని మిస్రీ తెలిపారు.

    Details

    భారత్ ప్రతీకార దాడులు

    భారత నగరాలు, పౌర సదుపాయాలు, సైనిక స్థావరాలే పాక్‌ లక్ష్యంగా తీసుకుందని, బఠిండాలోని సైనిక స్థావరంపై డ్రోన్‌ల దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు.

    భారత సాయుధ బలగాలు వాటిని విజయవంతంగా తిప్పికొట్టినట్టు చెప్పారు. అనంతరం భారత వైమానిక బలగాలు పాక్‌లోని నాలుగు గగనతల రక్షణ వ్యవస్థలపై ప్రతీకార దాడులు జరిపినట్టు వెల్లడించారు.

    ఈ దాడుల్లో పాక్‌కు చెందిన ఒక ఏయిర్ డిఫెన్స్ (AD) రాడార్‌ వ్యవస్థను భారత డ్రోన్‌ ధ్వంసం చేసిందన్నారు.

    అయితే, ఈ దాడుల విషయాన్ని పాకిస్థాన్‌ అధికార యంత్రాంగం నిరాకరించడం వారి ద్వంద్వ వైఖరిని స్పష్టంగా చూపిస్తోందన్నారు.

    Details

    పాఠశాలలే లక్ష్యంగా పాక్ దాడులు

    అదే సమయంలో నియంత్రణ రేఖ వెంబడి పాఠశాలలు, ప్రార్థనాలయాలపై పాక్‌ లక్ష్యంగా దాడులు చేస్తోందన్నారు.

    పూంచ్‌లో ఓ పాఠశాల సమీపంలోని ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.

    కాల్పుల భయంతో పాఠశాల సిబ్బంది సహా అనేకమంది బంకర్లలో తలదాచుకున్నారని, అదృష్టవశాత్తూ పాఠశాల మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలిపారు.

    పాక్‌ ఈ తరహా చర్యలు తీసుకోవడం వారి దిగజారిన ప్రవర్తనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

    భద్రతా పరిస్థితుల దృష్ట్యా కర్తార్‌పుర్‌ సాహిబ్‌ కారిడార్‌ సేవలను తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మిస్రీ వెల్లడించారు.

    Details

    పాకిస్థాన్ రెచ్చగొడుతోంది

    అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమావేశం నేడు జరుగుతుందని, పాకిస్థాన్‌కు సంబంధించి భారత్‌ తన అభిప్రాయాలను ఆ సమావేశంలో స్పష్టంగా వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు.

    తదుపరి చర్యలపై నిర్ణయం IMF బోర్డుకు వదిలిపెట్టినట్టు చెప్పారు.

    ఈ ఉదంతాలన్నింటిలోనూ పాకిస్థాన్‌ రెచ్చగొట్టే ధోరణి, తప్పుడు సమాచారం వ్యాప్తి, మతపరమైన రంగు వేసే కుట్రలు, శాంతియుత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే విధానం వెల్లడైందని విక్రమ్‌ మిస్రీ స్పష్టంచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం
    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు
    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు తెలంగాణ

    భారతదేశం

    #NewsBytesExplainer: భారతదేశం vs పాకిస్తాన్ సైనిక బలం: సైన్యం, నౌకాదళం, వైమానిక దళం వివరణాత్మక విశ్లేషణ పాకిస్థాన్
    Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం పాకిస్థాన్
    MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు భారతదేశం
    Jhelum River: ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‌కు షాకిచ్చిన భారత్ అంతర్జాతీయం

    పాకిస్థాన్

    India-Pakistan: పాకిస్థాన్‌కు భారత్ షాక్‌.. అన్ని మెయిల్స్‌, పార్సిళ్ల నిలిపివేత కేంద్ర ప్రభుత్వం
    Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక ప్రపంచం
    Pakistani Ranger: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్‌ రేంజర్‌ను పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు భారతదేశం
    India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025