NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో 
    పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో

    Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2025
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం దాడిలో పాలుపంచుకున్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తించిన హషిమ్ మూసా, పాకిస్థాన్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తు బృందాలు తేల్చాయి.

    ప్రస్తుతం అతను ఓ అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారిపోయినట్లు విచారణలో వెల్లడైంది.

    లష్కరే తోయిబా అనే పాక్‌కు చెందిన ఉగ్రసంస్థతో కలిసి అతను కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని సమాచారం.

    ఆ సంస్థ నేతలు, మూసాను కశ్మీర్ ప్రాంతానికి పంపారని దర్యాప్తు అధికారులు తెలిపారు.

    భారత సైన్యం ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పాటుగా ఉన్నారన్న అనుమానంతో వందలమంది స్థానికులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంది.

    వీరిలో 15మంది ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లు (OGWs)గా గుర్తించబడ్డారు. మూసా పాక్ సైన్యంలో ఉన్న అనుభవాన్ని వారు ధృవీకరించారని అధికారులు వెల్లడించారు.

    వివరాలు 

    పాక్ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందిన యోధులు

    "హషిమ్ మూసా, పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరే తోయిబాలో సహాయకుడిగా చేరిన వ్యక్తి" అని దర్యాప్తులో ఉన్న ఓ అధికారి మీడియాతో వెల్లడించారు.

    ఈ పరిణామం, పాక్ సైన్యం మరియు ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న బంధాన్ని స్పష్టంగా చాటుతోందని చెప్పారు.

    పాక్ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందిన యోధులు. వీరికి సంప్రదాయేతర యుద్ధనీతులు, రహస్య ఆపరేషన్లలో ప్రావీణ్యం కలిగి ఉంటుంది.

    శారీరకంగా, మానసికంగా బలోపేతం చేసే శిక్షణతోపాటు, వారిని యుద్ధనిర్వహణలో చురుకుగా తీర్చిదిద్దుతారు.

    అలాగే ఆధునిక ఆయుధాల వినియోగం, హస్తయుద్ధ నైపుణ్యం కలిగి ఉంటారు.

    వివరాలు 

    మూడు దాడుల్లోనూ పాల్గొన్న మూసా

    ఈ దాడిలో పాలుపంచుకున్న కొంతమంది గతంలో గగన్‌నగర్‌, గదర్‌బాల్‌ అడవుల్లో జరిగిన దాడుల్లోనూ భాగస్వాములయ్యారు.

    అక్కడ ఆరుగురు స్థానికేతరులు, ఒక డాక్టర్‌, ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లో వారివారిది పాత్ర ఉన్నట్టు గుర్తించారు.

    మూసా ఈ మూడు దాడుల్లోనూ పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

    అలాగే జునైద్ భట్, అర్బాజ్ మిర్ అనే ఇతర ఉగ్రవాదులు కూడా పాక్‌లో శిక్షణ పొందిన వారిగా గుర్తించబడ్డారు.

    వివరాలు 

    భద్రతా దళాల దృష్టి నుంచి తృటిలో..

    పహల్గాం దాడి ప్రణాళికను అమలు చేసేందుకు ఈ ముఠా దాదాపు 22 గంటలపాటు కాలినడక ప్రయాణం చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.

    కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు ట్రెక్కింగ్ చేస్తూ ఉగ్రదాడికి సన్నద్ధమయ్యారు. ఈ రకమైన ప్రయాణం,వారందరికి సైనిక స్థాయిలో శిక్షణ పొందినట్టు స్పష్టంగా సూచిస్తుంది.

    ప్రస్తుతం భారత సైన్యం వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే నాలుగుసార్లు వారు భద్రతా దళాల దృష్టి నుంచి తృటిలో తప్పించుకున్నారు.

    అయితే త్వరలోనే వారిని పట్టుకునే అవకాశం ఉందని భద్రతా అధికారులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పహల్గాం ఉగ్రవాద దాడి

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    పహల్గాం ఉగ్రవాద దాడి

    Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే భారతదేశం
    Pahalgam Attack video: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియో.. తెలీకుండానే రికార్డ్‌ చేసిన టూరిస్ట్‌!  భారతదేశం
    Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025