Priest: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అర్చకులు మధురనాథ్ కన్నుమూత
వారణాసికి చెందిన వేద పండితుడు పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ శనివారం కన్నుమూశారు. ఆయన అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో అర్చకుల బృందానికి నాయకత్వం వహించారు. 86 ఏళ్ల దీక్షిత్ ఈ శనివారం ఉదయం 6:45 గంటలకు తుది శ్వాస విడిచారు. దీక్షిత్ హిందూ సమాజం పట్ల అలాగే అతని నాయకత్వం పట్ల లోతైన భక్తికి ప్రసిద్ది చెందారు. ఆచార్య దీక్షిత్"కాశీకి చెందిన ప్రముఖ పండితుడు , శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ..ఆయన మృతికి సంతాపం తెలిపారు.