NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌..
    తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌..

    Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 29, 2025
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో ఉన్న "లాబొరేటరీ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎండేంజర్డ్‌ స్పీసీస్‌" (లాకోన్స్‌) కు చెందిన శాస్త్రవేత్తలు అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేశారు.

    వారు క్షీరద జంతువుల వెంట్రుకల నుంచి డీఎన్‌ఏను సంగ్రహించి పరీక్షలు నిర్వహించారు.

    ఈ ప్రయోగానికి తాజాగా పేటెంట్‌ లభించినట్లు,ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్‌ కార్తికేయన్‌ వాసుదేవన్‌ ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ తెలిపారు.

    కశ్మీర్‌కు చెందిన వ్యాపారులు, నేత కళాకారుల అభ్యర్థనల మేరకు, ఈ శాస్త్రవేత్తల బృందం 'శాటూష్', 'పష్మినా' ఉన్నిని గుర్తించగల డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది.

    ఇది గ్లోబల్‌గా తొలిసారి అభివృద్ధి చేయబడిన వినూత్న సాంకేతికతగా పేర్కొనవచ్చు.

    వివరాలు 

    శాటూష్‌ను అక్రమంగా తరలించి,దానిని కశ్మీర్‌ పష్మినాతో కలిపి తయారీ

    శతాబ్దాలుగా కశ్మీర్‌లోని గొర్రెల నుంచి వచ్చే పష్మినా ఉన్నిని ఉపయోగించి శాలువాలు తయారు చేసే సంప్రదాయం ఉంది.

    అదే సమయంలో,టిబెట్‌ ప్రాంతాల్లో శరవేగంగా అంతరించిపోతున్న జింకల నుంచి సేకరించే మృదువైన వెంట్రుకలతో 'శాటూష్' శాలువాలను తయారు చేస్తున్నారు.

    అయితే,ఈ జింకలు లుప్తప్రాయ జాతికి చెందినవిగా పరిగణించబడుతున్నందున,శాటూష్‌పై నిషేధం విధించబడింది.

    అయితే, కొన్ని అక్రమ దళాలు ఈ నిషేధాన్ని దుర్వినియోగం చేస్తూ శాటూష్‌ను 'పష్మినా'పేరిట అమ్ముతున్నట్లు గుర్తించారు.

    టిబెట్‌ నుంచి కశ్మీర్‌,లద్దాఖ్‌ ప్రాంతాలకు ముడి శాటూష్‌ను అక్రమంగా తరలించి,దానిని కశ్మీర్‌ పష్మినాతో కలిపి తయారీ చేస్తున్నారు.

    శాటూష్‌,అసలైన పష్మినాను వేరుగా గుర్తించడం అత్యంత క్లిష్టమైన పని కావడంతో,విమానాశ్రయాలు, షిప్పింగ్‌ కేంద్రాల్లో ఈ ఉత్పత్తుల రవాణా నిలిపివేయబడుతోంది.

    ఈ కారణంగా పష్మినా ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి.

    వివరాలు 

     భారత్‌లో ఈ టెక్నాలజీకి అధికారికంగా పేటెంట్‌ 

    ఈ నేపథ్యంలో వాసుదేవన్‌ బృందం రంగంలోకి దిగింది. ఒక సంవత్సర కాలం పాటు వారు తీవ్రంగా పరిశోధనలు జరిపి, టిబెటన్‌ జింకల ప్రత్యేకమైన మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ ప్రైమర్‌ను గుర్తించగలిగారు.

    దీని ఆధారంగా నిర్వహించే డీఎన్‌ఏ పరీక్ష ద్వారా శాటూష్‌ను చాలా సులభంగా గుర్తించవచ్చని వారు నిర్ధారించారు.

    ఈ డీఎన్‌ఏ ఆధారిత గుర్తింపు సాంకేతికతకు భారత్‌తో పాటు కెనడా, అమెరికా, యూరప్‌ దేశాల్లో కూడా పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశారు.

    ఈ క్రమంలో, భారత్‌లో ఈ టెక్నాలజీకి అధికారికంగా పేటెంట్‌ మంజూరైనట్టు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌.. తెలంగాణ
    Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు!  కోవిడ్
    USA: 'చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం'.. మార్కో రూబియో సంచలన ప్రకటన మార్కో రూబియో
    Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు కడప

    తెలంగాణ

    TGSRTC: తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక విరమణ భారతదేశం
    Telangana: మినీ అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు! భారతదేశం
    Hyderabad:వివిధ అంశాలలో పరీక్షలు.. ఇదీ 'మిస్‌ వరల్డ్‌' పోటీల తీరూతెన్నూ.. భారతదేశం
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025