NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు! 
    దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు!

    Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 29, 2025
    09:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భారత్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1010కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.

    కేసుల సంఖ్య వెయ్యిని దాటడం ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్లైన ఎన్‌బీ 1.8.1, ఎల్‌ఎఫ్‌ 7 ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.

    అయితే ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పరిస్థితి ఇంకా అదుపులోనే ఉందని, వ్యాప్తి తక్కువగానే కొనసాగుతున్నదని కన్సార్టియం స్పష్టం చేసింది.

    ముఖ్యంగా ప్రస్తుతం చలామణీలో ఉన్న జేఎన్‌1 సబ్‌వేరియంట్‌కు చెందిన ఎన్‌బీ 1.8.1 వేరియంట్‌ ప్రభావం తీవ్రంగా ఉందన్న స్పష్టమైన ఆధారాలు లభించలేదని వెల్లడించారు.

    Details

    కేసుల పెరుగుదలపై వైద్య నిపుణుల విశ్లేషణ

    కరోనా కేసుల పెరుగుదలపై వైద్య నిపుణులు పలు కీలక అంశాలను వివరించారు.

    గతంలో కరోనా సోకినవారికి లేదా టీకాలు వేసుకున్నవారికి ఇప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిన అవకాశం, అలాగే దేశంలో సీజనల్‌ ఫ్లూ, ఇతర వైరల్‌ ఇన్ఫెక్షన్లు పెరిగిన ప్రభావం వల్లనూ కేసులు పెరుగుతున్నట్లు తెలిపారు.

    ప్రస్తుతం వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచిస్తోంది.

    Details

    రాష్ట్రాల వారీగా కరోనా గణాంకాలు

    కరోనా తాజా గణాంకాల్లో కేరళ మరోసారి ఆందోళనకర స్థితిని ఎదుర్కొంటోంది.

    దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 43 శాతం కేరళలో ఉండగా, మహారాష్ట్రలో 21 శాతం కేసులు నమోదయ్యాయి.

    తరువాత ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. కేరళలో ఇప్పటివరకు 519 కేసులు, అలాగే మూడు మరణాలు సంభవించాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

    Details

    కేరళలో అప్రమత్తమైన వైద్య శాఖ

    కేసుల పెరుగుదల నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది.

    రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

    అన్ని జిల్లాల్లో టెస్టింగ్‌ వేగవంతం చేయాలని, అలాగే అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

    కేసుల పెరుగుదలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    కేరళ

    తాజా

    Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు!  కోవిడ్
    USA: 'చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం'.. మార్కో రూబియో సంచలన ప్రకటన మార్కో రూబియో
    Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు కడప
    Child Trafficking: సూర్యాపేటలో దారుణం.. దత్తత పేరుతో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్  సూర్యాపేట

    కోవిడ్

    మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది, ప్రపంచం సిద్ధమవ్వాలి: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక  ప్రపంచ ఆరోగ్య సంస్థ
    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం చైనా
    స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు  స్విగ్గీ

    కేరళ

    Wayanad bypolls: వాయనాడ్‌లో రేపు లోక్‌సభ ఉప ఎన్నికలు .. సత్తా చాటేదెవరో? ఉపఎన్నికలు
    Priyanka Gandi: విజయం దిశగా ప్రియాంక గాంధీ.. వయనాడ్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం ప్రియాంక గాంధీ
    Allu Arjun: కేరళలో గ్రాండ్ గా పుష్ప 2 ఫ్రీ రిలీజ్ వేడుక.. పెద్ద ఎత్తున్న చేరుకుంటున్న అభిమానులు అల్లు అర్జున్
    Kerala: 1500 మంది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెన్షన్‌.. వడ్డీతో సహా వసూలు చేయాలని మంత్రి ఆదేశం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025