NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్‌.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బహిర్గతం
    తదుపరి వార్తా కథనం
    Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్‌.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బహిర్గతం
    Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్‌.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బహిర్గతం

    Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్‌.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బహిర్గతం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 28, 2023
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెగాసస్‌ దుమారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు హ్యాకింగ్‌ వివాదం మరో మలుపు తీసుకుంది.

    ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించినట్లు ప్రముఖ అంతర్జాతీయ ఎన్‌జీఓ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది.దీంతో మళ్లీ పెగాసస్‌ వివాదం చెలరేగుతోంది.

    అక్టోబర్‌లో ఆపిల్‌ నుంచి హ్యాక్‌ అలెర్ట్‌లు వచ్చాక ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ గురువారం వెల్లడించింది.

    'ది వైర్‌' పత్రిక ఎడిటర్‌ సిద్ధార్థ వరదరాజన్‌ సహా మరో జర్నలిస్టు ఫోన్'ను పరీక్షించగా వాటిల్లో పెగసస్‌ ఉన్నట్లు తేల్చిందని వివరించింది.

    ప్రభుత్వ మద్దతుతో జరిగే హ్యాకింగ్‌కు వీరి ఫోన్లు టార్గెట్ అయ్యాయని ఆపిల్‌ నుంచి అక్టోబర్‌లో సందేశాలు వచ్చాయి.

    details

    ప్రతిపక్షాలకు,జర్నలిస్టులకు హ్యాకింగ్ అలెర్టులు

    తమ ప్రజల మానహక్కులను రక్షించడం, చట్టవిరుద్ధ నిఘా నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందని పేర్కొన్నారు.

    అక్టోబర్‌లో ఆపిల్‌ నుంచి పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు హ్యాకింగ్‌ అలెర్ట్‌లు సైతం వచ్చాయి.

    150 దేశాలకు సందేశాలు వెళ్లాయని యాపిల్ వివరించింది. అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్ట్ మాత్రం ప్రభుత్వమే ఆపిల్‌పై ఒత్తిడి తెచ్చి ఇటువంటి ప్రకటన చేయించిందని కథనం ప్రచురించింది.

    ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసింది.ఈ సాంకేతికతను ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది.భారత ఇంటెలిజెన్స్‌ 2017లో ఎన్‌ఎస్‌ఓ నుంచి పరికరాలను కొనుగోలు చేసింది.

    రాహుల్‌ గాంధీతో పాటు రాజకీయ నేతలు,న్యాయమూర్తులు ఇలా 300 మంది ఫోన్లు పెగాసస్‌తో హ్యాక్‌ చేసినట్లు అప్పట్లో 'ది వైర్‌' కథనం పార్లమెంట్‌ను కుదిపేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    భారతదేశం

    HAMAS :  హమాస్‌పై భారత ఇంటెలిజెన్స్ కీలక వ్యాఖ్యలు.. ఇజ్రాయెల్ పై దాడిని జిహాద్ విజయంగా జరుపుకోవడంపై ఆందోళన హమాస్
    canada: 'భారత్ కెనడా దౌత్య సంబంధాల్లో భారీ క్షీణత.. బలపడాలంటే రాత్రికి రాత్రి అయ్యే పనికాదు' కెనడా
    Strong Tremors in Delhi : దిల్లీలో మరోసారి భూప్రకంపనలు..భయాందోళనలో ప్రజలు  భూకంపం
    Diwali 2023: దీపావళి పండుగకు కచ్చితంగా చేసే.. ఈ ఐదింటి గురించి తెలుసుకోండి దీపావళి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025