
TGPSC: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని, దీనివల్ల అన్యాయం జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మూల్యాంకనంలో తప్పులున్నాయన్న పిటిషనర్లు
పరీక్షలో మొత్తం 18 సబ్జెక్టులు ఉండగా, కేవలం 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారని అభ్యర్థులు పేర్కొన్నారు.
పరీక్ష మూడు భాషల్లో జరిగినా అన్ని మాధ్యమాలకు తగిన నిపుణులు లేకుండా మూల్యాంకనం జరిపినట్లు ఆరోపించారు.
Details
టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు
ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఒకే మాధ్యమ నిపుణులతో దిద్దించారని, దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు.
పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కు నోటీసులు జారీ చేసింది.
నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.