NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. కార్మికుల రక్షణ కోసం విచారణ
    తదుపరి వార్తా కథనం
    SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. కార్మికుల రక్షణ కోసం విచారణ
    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. కార్మికుల రక్షణ కోసం విచారణ

    SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. కార్మికుల రక్షణ కోసం విచారణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 03, 2025
    03:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది.

    ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా కార్మికుల ఆచూకీ తెలియలేదని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.

    సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) పాల్గొంటున్నాయని, 24 గంటల పాటు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని హైకోర్టుకు వివరించారు.

    సహాయక చర్యలను ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. దీంతో హైకోర్టు ఈ వివరాలను నమోదు చేసుకుని, ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగించింది.

    Details

    సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

    తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. టన్నెల్ కూలిపోవడం, నీటి ముంపు కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

    ప్రమాదం జరిగిన ఏడు రోజుల తర్వాత రెస్క్యూ టీం గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ సహాయంతో మట్టిలో కూరుకుపోయిన ఐదు మృతదేహాలను గుర్తించింది.

    మిగతా ముగ్గురి కార్మికుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైకోర్టు
    తెలంగాణ

    తాజా

    Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్! బాలకృష్ణ
    Puri Jagannath: పూరీ-సేతుపతి కాంబోకి ఊహించని టైటిల్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! టాలీవుడ్
    Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం  రింకూ సింగ్
    Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు! హైదరాబాద్

    హైకోర్టు

    Himachal Pradesh: అనర్హత వేటుపై హైకోర్టుకు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు  హిమాచల్ ప్రదేశ్
    Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు  నాగపూర్
    రాజకీయాల్లోకి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి.. బీజేపీలో చేరిక బీజేపీ
    AP High Court: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఆంధ్రప్రదేశ్

    తెలంగాణ

    Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌ హైదరాబాద్
    Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
    Power consumption: భారీగా విద్యుత్తు కొనుగోలు.. 65 రోజుల్లో రూ.40 కోట్ల వ్యయం విద్యుత్
    Special buses: మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజుల పాటు ప్రత్యేక బస్సులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025