Page Loader
Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ

Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2025
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైన్యం ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు శపథం చేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదంపుర్‌లోని ఎయిర్‌బేస్‌ను సందర్శించిన తర్వాత ఆయన అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత్‌ మాతాకీ జై అంటూ మన జవాన్లు పలికే నినాదం శత్రువుల గుండెల్లో భయాన్ని నింపుతోందని ఆయన అన్నారు. మన దేశ సైనికుల ధైర్యాన్ని చూసిన తాను జీవితం సార్థకమైందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం ప్రదర్శించిన శౌర్యం త్రివిధ దళాల.. భూసేన, నౌకాసేన, వాయుసేనల.. ఐక్యతకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. భారత శక్తి సామర్థ్యం త్రివేణీ సంగమంలా ఒకే చోట ఐక్యతగా మెరిసిపోతోందని అభిప్రాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆదంపుర్‌లోని ఎయిర్‌బేస్‌ను సందర్శించిన ప్రధాని